ప్రభాతదర్శిని(తిరుపతి- జిల్లా ప్రతినిధి): పెళ్లకూరు మండలంలోని దిగువచావలి గ్రామం సమీప స్వర్ణముఖి నది నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను బుధవారం రాత్రి గ్రామస్తులు అడ్డుకొని నిలిపివేశారు.గత కొన్ని రోజులుగా పెన్నేపల్లి, దిగువచావలి గ్రామాల నుండి ట్రాక్టర్లుతో అక్రమంగా ఇసుక తరలింపు కొనసాగించుకుంటూ నాయకులంతా జేబులు నింపుకుంటున్నారు.అక్రమ ఇసుక రవాణా అని నివారించాల్సిన అధికారులు వ్యాపారులతో మండల కార్యాలయాల్లో మంతనాలు చేసుకొని భారీగా ముడుపులు అందుకుంటూ పబ్బం గడుపుతున్నారు.స్వర్ణముఖి నది నుండి అక్రమ ఇసుక రవాణా విషయమై గ్రామస్తులు పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా అధికారులకు సమాచారం అందిస్తున్న గ్రామస్తులపై కొందరు పోలీసు ఉన్నతాధికారులు తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.రాత్రి వేళల్లో రహస్యంగా ఇసుక అక్రమ తరలింపులు చేస్తున్న వ్యాపారులు పగటి వేళల్లో మండల కార్యాలయాల్లో అధికారులతో కలిసి మంతనాలు చేయడం విశేషం మండల కార్యాలయంకు వచ్చే అర్జీదారుల కన్నా ఇసుక వ్యాపారులకు ఎక్కువ టైం ఇస్తూ గంటల తరబడి కూర్చొని పెట్టుకుని కాలం గడుపుతున్నారు అని పెద్ద ప్రసారమే జరుగుతుంది,ఈ క్రమంలో ఒక్కో ట్రాక్టర్ కు 25వేలు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు స్థానికుల ఆరోపిస్తున్నారు.అక్రమ ఇసుక త్రవ్వకాల వల్ల వ్యవసాయ బోర్లకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న రైతులు చావలి గ్రామం వద్ద ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు.ఇసుక అక్రమ రవాణా కొనసాగించే వ్యాపారులతో పాటు,వారికి సహకరిస్తున్న మండల స్థాయి అధికారులపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులుపోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ స్పందించడం లేదనే ఆరోపణలు
Related Posts
14 నుండి 16 వరకు భారీ వర్షాలు.. అప్రమత్తంగా చర్యలు చేపట్టాలి:తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుండి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్ సందేశం మేరకు మన తిరుపతి జిల్లాలోని జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల అధికారులు అందరూ సమన్వయంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టి సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్…
Read moreఅమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : బొజ్జల రిషిత రెడ్డి
కరెన్సీ నోట్లతో శ్రీ సత్యమ్మ తల్లి కి అలంకరణ..ప్రభాతదర్శిని,(రేణిగుంట-ప్రతినిధి): దసరా నవరాత్రుల్లో భాగంగా రేణిగుంట మండలం భగత్ సింగ్ కాలనీ లో వెలసిన శ్రీ సత్యమ్మ తల్లికి శనివారం ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారికి కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. ప్రతి ఏటా నిర్వహించే దసరా నవరాత్రులలో చివరి రోజు కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం పరిపాటి అయింది. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా శ్రీకాళహస్తిఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్…
Read more