ప్రభాతదర్శిని (గూడూరు – ప్రతినిధి):తమ స్థలానికి పూర్తి స్థాయిలో అన్ని హక్కు పత్రాలు కలిగి ఉన్నప్పటికీ రెవిన్యూ అధికారులు అకారణంగా తమను వేదిస్తున్నారని తూమాటి శ్రీనివాస రావు,ఇనుకుర్తి రమణమ్మ, వెంకయ్య అనే స్థల యజమానులు ఆరోపించారు.శనివారం గూడూరు సనత్ నగర్ లోని తమ స్థలాల వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో తూమాటి శ్రీనివాస రావు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం తాము స్థానిక సనత్ నగర్ లోని సర్వే నంబర్ 576సి,576ఏ లలో వేర్వేరుగా స్థలాలు కొనుగోలు చేయడం జరిగిందన్నారు.తాము కొనుగోలు చేసినప్పటికే ఆయా స్థలాల కు మూడు లింక్ డాక్యుమెంట్ లు వరకూ ఉన్నాయన్నారు.కొన్ని నిర్మాణాలు కూడా ఉన్నాయన్నారు. కొనుగోలు అనంతరం తాము గూడూరు మున్సిపాలిటీ వారికి నిబంధనలను అనుసరించి లక్షల రూపాయలలో పన్నులు, వగైరాలు కూడా చెల్లించడం జరిగిందన్నారు. అయితే ఎవరి పట్ల వ్యవహరించని విధంగా రెవెన్యూ అధికారులు తమ పట్ల ఉద్దేశ్య పూర్వకంగా వేధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తమ స్థలంలోని నిర్మాణాలు కూల్చివేశారాన్నారు. అదేమని అడిగితే “పెద్దలను కలసి మాట్లాకో”మని చెబుతున్నారన్నారు.ఏ పెద్దలను కలవాలి? ఏ కారణం గా తమకు ఈ ఇబ్బందులు కలిగిస్తున్నారో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇనుకుర్తి రమణమ్మ,వెంకయ్య లు మాట్లాడుతూ తమ స్థలానికి రోడ్డు లేకుండా రెవిన్యూ శాఖ వారు ట్రెంచ్ కొట్టడం అన్యాయం అన్నారు.అనుభవం లో ఉన్న తమకు కాకుండా పాత తేదీ లతో విక్రయ దార్లకు నోటీసులు ఇచ్చినట్లు చూపుతున్నారని ఆరోపించారు.మాకు దారి అవసరం అయినపుడు మేము రోడ్డు పోరంబోకు స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నట్లు గా తప్పుడు ఆరోపణతో చర్యలు తీసుకోవడం ఏమిటని వాపోయారు.ఉన్నతాధికారులు కలెక్టర్, సబ్ కలెక్టర్ లు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.