టి.టి.యు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి
ప్రభాతదర్శిని,(సిరిసిల్ల-ప్రతినిధి):సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ ను వెంటనే ప్రకటించాలని టి.టి.యు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కొండికొప్పుల రవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రోజున సమగ్ర శిక్ష ఉద్యోగులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి టి.టి.యు తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పక్షాన సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా కొండికొప్పుల రవి మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు అయిన పే స్కేల్, జీవిత భీమా , హెల్త్ కార్డులు, సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులకు ఇతర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల సెలవులు ప్రభుత్వం వెంటనే ప్రకటించి వారి జీవితాలలో ఆనందాలు, వెలుగులు నింపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చాలీచాలని వేతనంతో అత్యంత దుర్భర పరిస్థితులలో జీవనం గడుపుతున్నారని, వారికి పే స్కేల్ ప్రకటించి అందిస్తే వారు ఆనందంగా వారి వృత్తి నిర్వహణలో ప్రభుత్వానికి, ఇటు ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఉంటూ కార్యనిర్వహణలో అంకితభావంతో పాల్గొంటారని పేర్కొన్నారు. సమ్మె శిబిరాన్ని టి.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి తడుకల సురేష్, చిరంజీవి తదితరులు సందర్శించి సంపూర్ణ మద్దతును తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.