ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలో వైసీపీకి షాక్ ల మీదు షాక్ లు తగులుతున్నాయి. గండవరం గ్రామం, గౌతమ్ నగర్కు చెందిన సర్పంచి నాగిరెడ్డి సునీల్ కుమార్, తన అనుచరులు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులోని వి.పి.ఆర్ ఇంటికి చేరుకున్న వారికి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతిరెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో జనార్థన్, నాగిరెడ్డి శీనయ్య, కోవూరు కృష్ణ, ఆంటోని, ప్రసన్న, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కష్టపడి పనిచేస్తామని స్పష్టం చేశారు. కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించుకొంటామని పేర్కొన్నారు.
వేమిరెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిన గండవరం సర్పంచ్
Related Posts
బాలికలకు విద్య అత్యంత ఆవశ్యకం….బాలికలను ఎదగనిద్దాం
●కౌమార దశ ఆడపిల్లల పై జరుగుతున్న దాడులను అరికట్టాలి.● అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా డాక్టర్ పసుపులేటి పాపారావు అందిస్తున్న ప్రత్యేక కథనం. దేశ భవిష్యత్తు పిల్లల పై ఆధారపడి ఉంటుంది. బాల బాలికలు జాతి సంపద. సమానత, స్వేచ్ఛ, గౌరవం, వారసత్వం, వ్యక్తిత్వం సార్వజనీనత వంటివి అందరికీ సమానంగా వర్తించే మానవ హక్కుల లక్షణాలు. కానీ నేటి మన దేశ పరిస్థితులలో బాలికలు వాళ్ళ హక్కులను పూర్తిగా…
Read moreఉత్పత్తి ధరకే నిత్యావసర సరుకులను ప్రజలకు అందించేలా చర్యలు: నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్తీక్
ప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి): వినియోగదారులపై భారం పడకుండా అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసి ఉత్పత్తి ధరకే నిత్యావసర సరుకులను ప్రజలకు అందించేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ అధికారులకు సూచించారు. గురువారం ఉదయం కలెక్టరేట్లోని శంకరన్ సమావేశం మందిరంలో జిల్లాస్థాయి ధరల స్థిరీకరణ కమిటీ సమావేశం జేసీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పామాయిల్, సన్ ప్లవర్ ఆయిల్, ఎర్రగడ్డలు, టమోటాల…
Read more