ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): నాయుడుపేట మండలంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్న పుస్తకాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తడుకు చందు డిమాండ్ చేశారు. బుధవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయుడుపేట శాఖ ఆధ్వర్యంలో నాయుడుపేట ఎంఈఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం నాయుడుపేట మండలంలో ఉన్న కొన్ని ప్రైవేటు పాఠశాలలో పుస్తకాలు అమ్మడం జరుగుతుందని, ఆ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయుడుపేట మండలం విద్యాధికారి మునిరత్నం కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తడుకు చందు మాట్లాడుతూ
అధిక ఫీజులు వసూలు , పుస్తకాల అమ్మకాలతో వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయుడుపేట పరిధిలో పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ, పుస్తకాలు అమ్మకాల వ్యాపారం చేస్తూ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఫీజుల కోసం తల్లిదండ్రులను వేధిస్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు.కాగా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇకనైనా విద్యాశాఖ అధికారులు అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అధిక ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాలు విక్రయిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తీసుకొస్తామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యదర్శి వినయ్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ విద్యాసంస్థల్లో పుస్తకాల విక్రయాలపై చర్యలు తీసుకోవాలి
Related Posts
14 నుండి 16 వరకు భారీ వర్షాలు.. అప్రమత్తంగా చర్యలు చేపట్టాలి:తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుండి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్ సందేశం మేరకు మన తిరుపతి జిల్లాలోని జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల అధికారులు అందరూ సమన్వయంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టి సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్…
Read moreఅమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : బొజ్జల రిషిత రెడ్డి
కరెన్సీ నోట్లతో శ్రీ సత్యమ్మ తల్లి కి అలంకరణ..ప్రభాతదర్శిని,(రేణిగుంట-ప్రతినిధి): దసరా నవరాత్రుల్లో భాగంగా రేణిగుంట మండలం భగత్ సింగ్ కాలనీ లో వెలసిన శ్రీ సత్యమ్మ తల్లికి శనివారం ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారికి కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. ప్రతి ఏటా నిర్వహించే దసరా నవరాత్రులలో చివరి రోజు కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం పరిపాటి అయింది. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా శ్రీకాళహస్తిఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్…
Read more