కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ అరుణ కుమారి
ప్రభాతదర్శిని,(గూడూరు – ప్రతినిధి):జిఎస్టి టాక్స్ లో అనేక మార్పులు టాక్స్ వస్తున్నాయని వాటిపై వ్యాపారస్తులందరూ అవగాహన పెంచుకోవాలని నిబంధనల మేరకు ఇన్ టైం లో రిటర్న్స్ ఫైల్ చేయాలని వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ గూడూరు సర్కిల్ అరుణకుమారి సూచించారు. గూడూరు పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ అరుణ కుమారి జీఎస్టీ నిబంధనలపై వ్యాపారస్తులతో అవగాహన సమావేశం నిర్వహించారు టాక్స్ లకు సంబంధించి పలు అంశాలపై వ్యాపారస్తులతో చర్చించారు అసిస్టెంట్ కమిషనర్ అరుణకుమారి మాట్లాడుతూ జీఎస్టీ వచ్చిన తర్వాత నిరంతరం అనేక మార్పులు వస్తున్నాయని వ్యాపారస్తులకు వాటిపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు జీఎస్టీ కలిగిన వ్యాపారస్తులందరూ తమ ఆధార్ను లింకు చేసుకోవాలని అలాగే వ్యాపారస్తులందరూ తమ వ్యాపార సంస్థలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు దుకాణాల్లో అద్దెకు ఉంటున్న వారు తమ రెంటల్ అగ్రిమెంటును రిటర్న్స్ లో తప్పనిసరిగా ఫైల్ చేయాలని కోరారు ప్రభుత్వా నిబంధనలు ఎప్పటికప్పుడు వ్యాపారస్తులకు తెలియజేస్తామని వాటిని అందరూ అనుసరించాలని పేర్కొన్నారు ఈ సమావేశంలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ప్రమీల ,వ్యాపార యూనియన్ నాయకులు సోమిశెట్టి చెంచురామయ్య ,చంద్రశేఖర్ ,కోట సునీల్ కుమార్,సుధాకర్, భాస్కర్, ప్రసాద్,కోటా రామారావు ,రాంప్రసాద్,ఎస్ ఎల్ ఎన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.