ప్రభాతదర్శిని,( నెల్లూరు-జిల్లా ప్రతినిధి): రోడ్ల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ పనులను “జటాయుు” యంత్రం సహాయంతో అతి తక్కువ సమయంలో అత్యంత సులభతరంగా పూర్తి చేయవచ్చని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ తెలియజేశారు. స్థానిక వి ఆర్ పీజీ కాలేజ్ వై.ఎం.సి.ఏ మైదానం సమీపంలో జటాయు యంత్రం పనితీరును కమిషనర్ బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జటాయు యంత్రం చిన్న చిన్న వ్యర్ధాలతోపాటు కొబ్బరి బోండాలను సైతం వాక్యూమ్ ప్రెషర్ పద్ధతిలో పీల్చిచేసి రోడ్లను శుభ్రపరు వస్తుందని తెలిపారు. వాహనాల కొనుగోలు ప్రక్రియలో భాగంగా ముందుగా నెల రోజులపాటు నగర వ్యాప్తంగా జటాయు యంత్రం సహాయంతో పారిశుధ్య నిర్వహణ పనులను చేపట్టనున్నామని, మెరుగైన ఫలితాలు కనబరిస్తే నూతన యంత్రాలను కొనుగోలు చేసి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.