ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):చంద్రబాబు పేరు చెబితే కలలో కూడా నిద్ర లేచి మరి చెప్పే పథకం ఏమైనా ఉందంటే ‘కరువు-కాటకం’ అని, రాష్ట్రంలో తిరిగి పొరపాటున చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇప్పుడు వస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆగిపోవడం గ్యారంటీ అని ఆ విషయాలను ప్రజలు ఒకసారి కూర్చొని చర్చించుకుని ప్రజలకు ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలను ప్రభుత్వ కార్యక్రమాలను అందించిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి తిరిగి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మనందరం అండగా ఉండాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. తాను అల్లూరు, సర్వేపల్లి, నెల్లూరు పార్లమెంట్, రూరల్ ఇన్చార్జిగా పనిచేసిన సమయాల్లో ఎక్కడ కూడా ఎవరిని బెదిరించినట్లు, వేధించినట్లు, కేసులు పెట్టినట్లు, ఇబ్బంది పెట్టినట్లు ఎక్కడ కనిపించిన దాఖలు లేవని ఆ విషయాన్ని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి మంచికి చోటు ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తన 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడా కూడా, ఎప్పుడో కూడా చిన్న అవినీతి మచ్చ కూడా తన పైన లేదని ఆ అంశాలను కూడా ప్రజలు పరిగణాలోనికి తీసుకొని తనకు రానున్న ఎన్నికల్లో మంచి మద్దత్తు అందించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. భవిష్యత్తులో ప్రజలందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషాలతో జీవించాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానని వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఆమంచర్ల గ్రామం అభిమానంతో చిందులేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఏమాత్రం అభిమానం తగ్గలేదు అనే విధంగా సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి రోడ్ షోలో నిరూపించారు. గుండె నిండా వైస్సార్సీపీ అభిమానాన్ని, మదిలో జగనన్న ప్రేమ వెరసి ఉప్పొంగిన అభిమానం ఉరకలేస్తూ చిన్న, పెద్ద, పురుషులు, స్త్రీలను తేడా లేకుండా ఆనందోత్సాహాలతో చిందులేసి ఆమంచర్ల గ్రామం వైఎస్ఆర్సిపి అడ్డా అని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి విజయ సంఘీభావాలు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల రోడ్ షోకు ఆమంచర్ల గ్రామపంచాయతీ మజారా నుండి పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండు చేతులు జోడించి వినయ పూర్వకంగా నమస్కరిస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. తమ అభిమాన నాయకుడికి ఆమంచర్ల గ్రామస్తులు తిరిగి రెండు చేతులు ఊపి తమ మద్దత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే, మీ విజయని మేం కోరుకుంటున్నాం అని సంకేతాలు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుండి పోటీ చేస్తున్న తనను నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి విజయ సాయిరెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది ‘కరువు-కాటకం’. పధకం… ఆమంచర్ల రోడ్ షో లో ఆదాల ఎద్దేవా
Related Posts
చెరువులను గుల్ల చేస్తూ…వెంచర్లకు అక్రమంగా గ్రావెల్ తరలింపు
అవినీతిలో పెళ్ళకూరు ఇరిగేషన్ ఏ.ఈ.రూటే సపరేట్… చెరువుమట్టిని మింగేస్తున్న అవినీతి తిమింగలం ప్రభాతదర్శిని,(తిరుపతి ప్రత్యేక-ప్రతినిధి):పెళ్లకూరు మండలంలో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఏఈ రూటే సపరేట్ గా ఉంది. చెరువుల అభివృద్ధికి కృషి చేయవలసిన ఆ అధికారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువులో మట్టిని మింగేస్తున్నాడని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకులను స్వామి భక్తితో ఆకట్టుకుంటూ పెళ్లకూరు మండలంలోని వివిధ చెరువులో మట్టిని…
Read moreఅడుగుకోక గతుకు…ఏమౌతుందో బ్రతుకు…
అధ్వాన్నంగా కోట ఆర్ అండ్ బి రోడ్లు…నిద్రావస్థలో అధికారులు…. పాలకులు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): రాజకీయ పరిభాషలో కోట – వాకాడు మండలాలు రాజకీయాల నిలయంగా ప్రాచుర్యం ఉంది. ఒకప్పుడు రవాణాకు సరైన మార్గాలు లేని రోజులలో కోట వాకాడు నుండి రాజకీయాలు నడిపిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయా ప్రాంతాల అభివృద్ధికి వారి వారి స్థాయిలో ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా…
Read more