*ఎమ్మెల్యే* పులివర్తి నాని
ప్రభాతదర్శిని, (తిరుచానూరు -ప్రతినిధి): చంద్రగిరిలో టిడిపి గెలుపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు కానుకగా ఇస్తున్నట్లు ఆ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. బుధవారం ఆయన తిరుచానూరు లోనే పద్మావతి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత చంద్రగిరిలో టిడిపి జెండా ఎగరవేయడం చాలా సంతోషకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. చంద్రగిరి సీటును టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు కు కానుకగా ఇస్తున్నామని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం భారీ మెజారిటీతో చంద్రగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన పులివర్తి
దర్శనానంతరం వేద ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో పులివర్తి నాని కుటుంబాన్ని ఆశీర్వదించారు. అధికారులు ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రోత్సహించిన నారా చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించిన ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత తెలుగు తమ్ముళ్లు శ్రీ పద్మావతి అమ్మవారికి 501 కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.