తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి తీర్పు
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష తలా రూ.6 లక్షల జిరిమానా విధిస్తూ ఎర్రచందనం ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పువెల్లడించింది. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ చీఫ్ ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను అమలులో భాగంగా టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ పీ.శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదై విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలను పగడ్బందీగా నిరూపించి ముద్దాయిలకు శిక్ష పడేలా ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా క్రైమ్ నెంబరు 06-2020లో కరకంబాడి బీటు, తిరుపతి రేంజి పరిధిలో పట్టుబడ్డ ప్రకాశం జిల్లాకు చెందిన చెరబోయిన వెంకటరమణ, పింజరి మహబూబ్ బాషా ఇద్దరు ముద్దాయిలు చేసిన నేరం రుజువయ్యింది. దీంతో తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహ మూర్తి ఒకొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాల మేరకు వారిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ముద్దాయిలకు శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని టాస్క్ ఫోర్సు ఉన్నతాధికారులు అభినందించారు. శేషాచలం రిజర్వు ఫారెస్టులో అత్యంత విలువైన సహజ సంపద ఎర్ర చందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేసే నేరస్తులకు ఈ తీర్పు ఒక హెచ్చరికగా పని చేస్తుందని టాస్క్ ఫోర్సు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్లు జైలు శిక్ష…ఒకొక్కరికి రూ. 6లక్షల జరిమానా
Related Posts
ఇంటర్ ఫలితాల్లో శ్రీ వేమ కాలేజీకి స్టేట్ సెకండ్ ర్యాంక్
100 శాతం అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ర్యాంకు సాధించిన వి.శ్రీహాసిని కరస్పాండెంట్ పి శ్రీనివాసులు రెడ్డి అభినందనలు ప్రభాతదర్శిని, (నాయుడు-పేట ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాయుడుపేట పట్టణంలోని శ్రీ వేమ జూనియర్ కళాశాల విద్యార్థిని వి.శ్రీహాసిని స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించి ప్రభంజనం సృష్టించింది. అలాగే శ్రీ వేమ జూనియర్ కళాశాల లోని ఇంటర్మీడియట్ విద్యార్థులు 100 శాతం…
Read moreఇంటర్ ఫలితాల్లో నాయుడుపేట విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం
ప్రభాతదర్శిని, (నాయుడుపేట- ప్రతినిధి):రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో నాయుడుపేట పట్టణంలోని విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు.ఈ సందర్భంగా కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారెడ్డి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు అభినందించారు.విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషిచేసిన అధ్యాపకలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో విద్యార్థుల పరీక్ష ఫలితాల వివరాలను…
Read more