కరెన్సీ నోట్లతో శ్రీ సత్యమ్మ తల్లి కి అలంకరణ..
ప్రభాతదర్శిని,(రేణిగుంట-ప్రతినిధి): దసరా నవరాత్రుల్లో భాగంగా రేణిగుంట మండలం భగత్ సింగ్ కాలనీ లో వెలసిన శ్రీ సత్యమ్మ తల్లికి శనివారం ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారికి కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. ప్రతి ఏటా నిర్వహించే దసరా నవరాత్రులలో చివరి రోజు కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం పరిపాటి అయింది. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా శ్రీకాళహస్తిఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషిత రెడ్డి పాల్గొన్నారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు బొజ్జల రిషిత రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి ప్రాంగణంలోఅమ్మవారిముగ్గుని అత్యంత వైభవంగా మలిచారు. అమ్మవారి ముగ్గుపై రిషితా రెడ్డి జ్యోతులను ప్రారంభించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ సదాశివ రెడ్డి ఆయన సతీమణి బొజ్జల రిషిత రెడ్డి కి సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు చీరలు, హారం గా అమ్మవారికి అలంకరించిన కరెన్సీ నోట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొజ్జల రిషితా రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలోఆలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.