కరెన్సీ నోట్లతో శ్రీ సత్యమ్మ తల్లి కి అలంకరణ..
ప్రభాతదర్శిని,(రేణిగుంట-ప్రతినిధి): దసరా నవరాత్రుల్లో భాగంగా రేణిగుంట మండలం భగత్ సింగ్ కాలనీ లో వెలసిన శ్రీ సత్యమ్మ తల్లికి శనివారం ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారికి కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. ప్రతి ఏటా నిర్వహించే దసరా నవరాత్రులలో చివరి రోజు కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం పరిపాటి అయింది. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా శ్రీకాళహస్తిఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషిత రెడ్డి పాల్గొన్నారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు బొజ్జల రిషిత రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి ప్రాంగణంలోఅమ్మవారిముగ్గుని అత్యంత వైభవంగా మలిచారు. అమ్మవారి ముగ్గుపై రిషితా రెడ్డి జ్యోతులను ప్రారంభించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ సదాశివ రెడ్డి ఆయన సతీమణి బొజ్జల రిషిత రెడ్డి కి సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు చీరలు, హారం గా అమ్మవారికి అలంకరించిన కరెన్సీ నోట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొజ్జల రిషితా రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలోఆలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం నాయకులు, భక్తులు పాల్గొన్నారు.