ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుతో తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవులు భేటీ అయ్యారు. బుధవారం లోకేష్ బాబు నెల్లూరులో జరిగినయువతతో ముఖాముఖి సమావేశ ఎన్నికల ప్రచార కార్యక్రమం కు విచ్చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని నెల్లూరు పార్లమెంటు ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ పి.రూప్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని పీఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూమ్ కుమార్ యాదవ్ చేస్తున్న కృషిని నారా లోకేష్ ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో పని చేసి జిల్లాలో ప్రభంజనం సృష్టించాలని కోరారు.
నారా లోకేష్ తో విపిఆర్, రూప్ కుమార్ లు భేటీ
Related Posts
బాలికలకు విద్య అత్యంత ఆవశ్యకం….బాలికలను ఎదగనిద్దాం
●కౌమార దశ ఆడపిల్లల పై జరుగుతున్న దాడులను అరికట్టాలి.● అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా డాక్టర్ పసుపులేటి పాపారావు అందిస్తున్న ప్రత్యేక కథనం. దేశ భవిష్యత్తు పిల్లల పై ఆధారపడి ఉంటుంది. బాల బాలికలు జాతి సంపద. సమానత, స్వేచ్ఛ, గౌరవం, వారసత్వం, వ్యక్తిత్వం సార్వజనీనత వంటివి అందరికీ సమానంగా వర్తించే మానవ హక్కుల లక్షణాలు. కానీ నేటి మన దేశ పరిస్థితులలో బాలికలు వాళ్ళ హక్కులను పూర్తిగా…
Read moreఉత్పత్తి ధరకే నిత్యావసర సరుకులను ప్రజలకు అందించేలా చర్యలు: నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్తీక్
ప్రభాతదర్శిని,(నెల్లూరు-ప్రతినిధి): వినియోగదారులపై భారం పడకుండా అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసి ఉత్పత్తి ధరకే నిత్యావసర సరుకులను ప్రజలకు అందించేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ అధికారులకు సూచించారు. గురువారం ఉదయం కలెక్టరేట్లోని శంకరన్ సమావేశం మందిరంలో జిల్లాస్థాయి ధరల స్థిరీకరణ కమిటీ సమావేశం జేసీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పామాయిల్, సన్ ప్లవర్ ఆయిల్, ఎర్రగడ్డలు, టమోటాల…
Read more