పార్టీ నాయకులకు కార్యకర్తలకు సిఎం చంద్రబాబు స్ఫూర్తి
తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో గెలుపొంది చంద్రగిరి గడ్డ టిడిపి అడ్డా అని నిరూపిస్తామని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి సవాల్ విసిరారు.సోమవారం చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశం స్థానిక పార్టీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి మన మంచి ప్రభుత్వం కార్యక్రమం పై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో గెలుపొంది చంద్రగిరి గడ్డ టిడిపి అడ్డా అని నిరూపిస్తామని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో చేయలేని అనేక పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేసి చూపించామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో దూర దృష్టితో రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల బాగోగుల కోసం 75 ఏళ్ల వయసులో రోజులో కేవలం 5 గంటలు నిద్రపోతూ 19 గంటలు పనిచేస్తున్నారని కొనియడారు. అలాగే యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతి రెండు నెలలకు రాష్ట్రానికి ఒక పరిశ్రమను తీసుకువస్తూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో లోకేష్ ఆధ్వర్యంలో 20వేల కోట్లతో ఎల్జీ కంపెనీని ప్రారంభించి ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది యువతకు ఉపాధి కల్పించారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో పర్యటిస్తూ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.ఏడాదిలోపే వేల కోట్లను నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే నాని కు దక్కుతుందన్నారు. నిత్యం నియోజకవర్గంలోని ప్రజల బాగోగుల గురించి ఆలోచించి ఎమ్మెల్యే చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు దొరకడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే నిధులతో పాటు తుడా నిధులను నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో ప్రజల కోసం అమలు చేసిన అనేక పథకాలు అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాల అమలపై ఇంటింటికి ప్రచారం చేస్తున్నామని తెలిపారు.అదే విధంగా గత వైసిపి ప్రభుత్వం చేసిన అరాచకాలపై కూడా ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి టిడిపి నాయకులు కార్యకర్తలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.