ప్రభాతదర్శిని,( తిరుపతి-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఎంపీ మిథున్ రెడ్డిని సూళ్లూరుపేట నియోజకవర్గ నాయుడుపేట వైసిపి నాయకులు నాయుడుపేట మండల వైసీపీ అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం తిరుపతి నగరంలోని మిథున్ రెడ్డి నివాసంలో ఆయనను మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తోపాటు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి ఈదా రత్నశ్రీ లు మర్యాదపూర్వకంగా కలిసి సందర్భంగా వారు మిధున్ రెడ్డికి పుష్ప గుచ్చాలు అందజేసి, సన్మానించి,శుభాకాంక్షలు తెలియజేశారు.
															 
							
						
				
	
		
	 
	
		
		నన్నూరు శ్రీనివాసరావు  పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో  వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో  పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని  సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి  జర్నలిజంపై మక్కువతో  "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.