ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలో వైసీపీకి షాక్ ల మీదు షాక్ లు తగులుతున్నాయి. గండవరం గ్రామం, గౌతమ్ నగర్కు చెందిన సర్పంచి నాగిరెడ్డి సునీల్ కుమార్, తన అనుచరులు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులోని వి.పి.ఆర్ ఇంటికి చేరుకున్న వారికి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతిరెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో జనార్థన్, నాగిరెడ్డి శీనయ్య, కోవూరు కృష్ణ, ఆంటోని, ప్రసన్న, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కష్టపడి పనిచేస్తామని స్పష్టం చేశారు. కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించుకొంటామని పేర్కొన్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.