ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్ర సాంకేతిక, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో తిరుపతి జిల్లా ఓజిలి మండలం టిడిపి అధ్యక్షులు గుజ్జులపూడి విజయకుమార్ నాయుడు భేటీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో విజయకుమార్ నాయుడు లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ బాబు విజయ్ కుమార్ నాయుడిని విజయకుమార్ నాయుడు ని ఆప్యాయంగా పలకరిస్తూ ఓజిలి మండలంలో, సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న, చోటు చేసుకుంటున్న రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఓజిలి మండలంలోని పున్నేపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా మార్చాలని విజయ్ కుమార్ నాయుడు కోరడంతో మంత్రం లోకేష్ బాబు అందుకు సుముఖం వ్యక్తం చేసి, యు పి స్కూల్ ను జిల్లా పరిషత్ హై స్కూల్ గా చేస్తామని హామీ ఇచ్చినట్లు విజయకుమార్ నాయుడు తెలిపారు. విజయ్ కుమార్ నాయుడు కృషితో యుపి స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గా స్థాయి మారడంతో గ్రామస్తులు పరిసర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు సూళ్లూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ తో సూళ్లూరుపేట, పెళ్ళకూరు, దొరవారిసత్రం, ఓజిలి, నాయుడుపేట మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కుక్కు శంకరయ్య, సంచి కృష్ణయ్య, పెమ్మసాని శ్రీనివాసులు నాయుడు, గుజ్జులపూడి విజయ్ కుమార్ నాయుడు, చంద్రారెడ్డి, టిడిపి యువ నాయకుడు ఎస్కే రఫీ తదితరులు భేటీ అయ్యారు.