ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్ర సాంకేతిక, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో తిరుపతి జిల్లా ఓజిలి మండలం టిడిపి అధ్యక్షులు గుజ్జులపూడి విజయకుమార్ నాయుడు భేటీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో విజయకుమార్ నాయుడు లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ బాబు విజయ్ కుమార్ నాయుడిని విజయకుమార్ నాయుడు ని ఆప్యాయంగా పలకరిస్తూ ఓజిలి మండలంలో, సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న, చోటు చేసుకుంటున్న రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఓజిలి మండలంలోని పున్నేపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా మార్చాలని విజయ్ కుమార్ నాయుడు కోరడంతో మంత్రం లోకేష్ బాబు అందుకు సుముఖం వ్యక్తం చేసి, యు పి స్కూల్ ను జిల్లా పరిషత్ హై స్కూల్ గా చేస్తామని హామీ ఇచ్చినట్లు విజయకుమార్ నాయుడు తెలిపారు. విజయ్ కుమార్ నాయుడు కృషితో యుపి స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గా స్థాయి మారడంతో గ్రామస్తులు పరిసర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు సూళ్లూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ తో సూళ్లూరుపేట, పెళ్ళకూరు, దొరవారిసత్రం, ఓజిలి, నాయుడుపేట మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కుక్కు శంకరయ్య, సంచి కృష్ణయ్య, పెమ్మసాని శ్రీనివాసులు నాయుడు, గుజ్జులపూడి విజయ్ కుమార్ నాయుడు, చంద్రారెడ్డి, టిడిపి యువ నాయకుడు ఎస్కే రఫీ తదితరులు భేటీ అయ్యారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.