ప్రభాతదర్శిని (తిరుపతి -ప్రతినిధి): జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, వైజాగ్ చెన్నై కారిడార్పైపు లైన్ పనులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, ఏపీఐఐసీ సంబంధించి దుగ్గరాజపట్నం పనులు, శ్రీ సిటీలోని ఎల్జి కంపెనీకి సంబంధించి అంశాలపై పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళిక భద్దంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, వైజాగ్ చెన్నై కారిడార్ పైప్ లైన్ పనులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, ఏపీఐఐసీ సంబంధించి దుగ్గరాజపట్నం పనులు, శ్రీ సిటీ, శ్రీ సిటీలోని ఎల్జి కంపెనీకి సంబంధించి అంశాలు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో తిరుపతి, నెల్లూరు , చెన్నై నేషనల్ హైవే పి డి లు, తిరుపతి,శ్రీకాళహస్తి సూళ్లూరుపేట ఆర్డీఓలు, రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, రోడ్డు భవనాల శాఖ ఎస్.ఈ రాజా నాయక్, రైల్వే ప్రాజెక్టు అధికారులు రాధాకృష్ణ, పావన మూర్తి, తిరుపతి, నెల్లూరు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్లు విజయ్ భరత్ రెడ్డి, ఎల్. శివకుమార్, ఈ ఈ ఇరిగేషన్ సంబంధిత మండలాల తహసీల్దార్లు, కాంట్రాక్టర్లు,తదితర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ సిటీ ఫేస్ -2, ఎల్ జి ఫేస్-1,2 కు సంబందించిన పెండింగ్ భూసేకరణ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టు లకు సంబందించిన పెండింగ్ కోర్టు కేసులను కూడా త్వరగా పరిస్కారం అయ్యేలా చూడాలన్నారు. వెబ్ ల్యాండ్ పై వున్న సమస్యలను సత్వరమే పరిస్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, వైజాగ్ చెన్నై కారిడార్ పైపు లైను పనులు, రైల్వే ప్రాజెక్ట్స్ పనులు పురోగతిలో ఉన్న పనులపై రేణిగుంట- పూడి, గుమ్మడి పూండి-గూడూరు, గూడూరు-రేణిగుంట రేణిగుంట-పాకాల-తిరుపతి టౌన్ సంబంధించిన రైల్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు. ఆరు లైన్లు రహదారులు నిర్మాణం, పీలేరు -కాలూరు, రేణిగుంట నుండి చెన్నై రహదారుల పనులు పూర్తి చేయాలని భూ సేకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్యాకేజీ 2,3,4 జాతీయ రహదారి పనులు సాగరమాల కింద చేపట్టిన వాటిని పెండింగ్ లేకుండా రెవెన్యూ డివిజనల్ అధికారులు నేషనల్ హైవే అధికారులతో సమన్వయంతో చేసుకొని నాణ్యత తో పనులు పూర్తి కావాలని అన్నారు. పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు. అలాగే ఆర్ అండ్ బి , పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఇరిగేషన్ ఫారెస్ట్, జల వనరుల శాఖ అధికారులు అందరూ కలసి సమన్వయంతో పెండింగ్ పనులను నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాలన్నారు. ఏపీఐఐసీ ప్యాకేజీ 5, ఎడిబి రోడ్లు పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో సంబంధిత తహసీల్దార్లు, డెప్యూటీ తహసీల్దార్లు భాస్కర్, శివప్రసాద్ భూసేకరణ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
