పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గడ్డం హనోక్

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై సమగ్ర విచారణ జరిపించాలని పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గడ్డం హనోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, వివిధ ఫెలోషిప్ సభ్యుల ఆధ్వర్యంలో ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ సమర్పించారు. మార్చి 24వ తేది రాజమహేంద్రవరం కొంతమూరు వద్ద అనుమానాస్పదంగా మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పూర్తి స్థాయిలో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతిపై చాలా క్రైస్తవులకు అనుమానాలు ఉన్నాయని వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాలను నివృత్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రవీణ్ ది ప్రమాదం కాదు హత్యే అని తేలితే దోషులపై కట్టిన చర్యలు తీసుకొని క్రైస్తవ సమాజానికి రక్షణ కల్పించాలని కోరారు. అలాగే సోషల్ మీడియాలో కొందరు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని అలాంటి వారు ఏ సమాజానికి సంబంధిన వారైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టరేట్ ముందు కొద్దిసేపు నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కి మెమోరాడం అందజేశారు.ఈ కార్యక్రమములో పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం హనోక్, జిల్లా అధ్యక్షులు ఆత్మకూరు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి యం. జాషువా, కోశాధికారి సోడం. ఎనోష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్కా. సునీల్ గావాస్కర్
సహాయ కార్యదర్సులు యం. శ్యామ్ నెల్లూరు రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు వెలగపల్లి. క్రాంతి కుమార్, డి. జోన, పి. భాస్కర్, ఏ. అరుణ్, ఏ. కిరణ్, ఏ. మోసెస్, డి. మోసెస్, బి. మధు
డి. దానియేలు, జి. అబ్రాహాము, కె. జాన్ పాల్, ఎన్. సంపత్, పి. జాన్ పాల్, జె. చైతన్య, పి. పాల్, ఇమ్మానుయేల్ తదితరులు పాల్గొన్నారు.