ప్రభాతదర్శిని((నాయుడుపేట ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన‌ 2025 పది ఫలితాల్లో తిరుపతి జిల్లా, చిట్టమూరు మండలం,కొత్తగుంట లోని తంబిరెడ్డి మనోహర్ రెడ్డి విద్యాసంస్థల( టి ఎమ్ ఆర్ )విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.షేక్ సుహాన 577/600 మార్కులతో మండలంలో మొదటి స్థానం సాధించింది.పి శ్రీ సాయి సంజన 569 మార్కులతో రెండో స్థానంలో నిలిచింది.టిఎంఆర్ లో 50 మంది విద్యార్థులకు గాను 47 మంది పాసై 94 శాతం ఉత్తీర్ణత సాధించారు.12 మంది విద్యార్థులు 500 మార్కులకు సాధించగా మండలంలో మొదటి, రెండవ స్థానాన్ని టిఎంఆర్ విద్యా సంస్థలు దక్కించుకున్నాయి. టిఎంఆర్ విద్యార్థులు మండలంలో మొదటి,రెండవస్థానం సాధించడంపై కరస్పాండెంట్ మనోహర్ రెడ్డి విద్యార్థులను అభినందించారు.550 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు. పలువురు విద్యార్థులు గణితం, సాంఘిక శాస్త్రంలో 100/100 మార్కులు సాధించడంపై ఉపాధ్యాయులు కె శ్రీనివాసులు,బి గోపాల్ లను ప్రత్యేకంగా అభినందించారు.క్రమం తప్పకుండా టిఎంఆర్ విద్యార్థులు ప్రతి సంవత్సరం మండలంలో మొదటి, రెండో స్థానాలు,అత్యధిక మార్కులు, అత్యుత్తమ ఫలితాలను సాధిస్తుండడంపై హర్షం వ్యక్తం చేసి,విద్యార్థులు,ఉపాధ్యాయులను అభినందించి,శుభాకాంక్షలు తెలియజేశారు.మారుమూల ప్రాంతంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యధిక మార్కులు, అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న టిఎంఆర్ విద్యాసంస్థలు క్రమశిక్షణ,అత్యుత్తమ బోధనతో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధనకు కృషి చేయనున్నట్లు కూడా ఈ సందర్భంగా కరస్పాండెంట్ తంబిరెడ్డి మనోహర్ రెడ్డి తెలియజేశారు.