నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీఎస్పీ ఎం. సూర్య నారాయణ రెడ్డి


ప్రభాతదర్శిని,(గూడూరు -ప్రతినిధి): నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు తప్పవని డీఎస్పీ ఎం. సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డు, హాస్పిటల్ రోడ్డు ప్రాంతాలలో ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఆపి ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం చేయరాన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రతి ఒక్క వాహనచోదకుడు తప్పనిసరిగా వారి వాహనాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. అనంతరం పలు ఆటోల ను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు.  ఆయన వెంట పట్టణ సీఐ పాపారావు, ఎస్ఐ శ్రీహరిబాబు, సిబ్బంది ఉన్నారు.