ప్రభాతదర్శిని,(నాయుడుపేట- ప్రతినిధి):: నాయుడుపేట పట్టణంలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్ లో జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని సూళ్లూరుపేట ఇన్చార్జ్, నాయుడుపేట ఏ ఎం సీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ లు ప్రారంభించారు.ఈ సందర్భంగా హస్తకళా అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ నిబద్దలతో పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేసిన ఉయ్యాల ప్రవీణ్ సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని అన్ని అంగులతో ఏర్పాటు చేయడం అభినందనీయమని, కార్యకర్తలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు అట్లా కృష్ణారావు,నాయకులు గిండి సతీష్,బాలుశెట్టి, పలువురు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.