ప్రభాతదర్శిని, (తిరుచానూరు-ప్రతినిధి):ఇటీవల చంద్రబాబు నాయుడు సమీక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఉమ్మడి పద్మావతి పురం మాజీ సర్పంచ్, గణపతి నాయుడు ను అలాగే జేబీ రమణ, శ్రీనివాసపురం ఉపసర్పంచ్ సునీల్ చౌదరి ను తెలుగు యువత నాయకులు దిలీప్ రాయల్ బుధవారం మర్యాదపూర్వంగా కలిసి ఘనంగా సత్కరించారు. రానున్న ఎన్నికలలో కూటమి అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా పనిచేసేందుకు సమిష్టిగా అందరి సమన్వయంతో ముందుకెళ్తామని చెప్పారు. యుగంధర్ రాయల్, శశి, భరత్, శివ రాయల్ శ్రావణ్ కుమార్ రాయల్, వంశీకృష్ణ రాయల్, జయకృష్ణ రాయల్, సురేష్ రెడ్డి ఆనంద్ రాయల్, వినోద్ రాయల్, హరీష్ రాయల్, విద్యాధర్, ముని, సురేష్ సన్మానించిన వారిలో ఉన్నారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.