ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గా బుధవారం ఉదయం శుభం భన్సల్ జిల్లా కలెక్టరేట్ నందు బాధ్యతలు స్వీకరించారు. 2020 బ్యాచ్ ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి జిల్లాలో జెసి గా పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. జెసి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఎఓ జయరాములు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు నూతన జెసికి శుభాకాంక్షలు తెలిపారు.