ప్రభాతదర్శిని,(తిరుచానూరు-ప్రతినిధి): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన తెలంగాణ జార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్ రాధాకృష్ణన్ కు టిటిడి అధికారులు ఆలయం వద్ద స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టిటిడి అధికారులు గవర్నర్ కు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.ఆలయం వెలుపల గవర్నర్ కు బిజెపి నాయకుల గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బిజెపి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బిజెపి తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బిజెపి యువమోర్చా నాయకులు దీపక్ యాదవ్ ,జయంత్ కుమార్, బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు మల్లారపు రవిప్రసాద్ ,బిజెపి తిరుచానూరు నాయకులు మనీ తదితరులు పాల్గొన్నారు.