ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను
హోం మంత్రి పదవి వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోం మంత్రి పదవి దక్కగా.. చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ.. పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి పదవిని కేటాయించిన చంద్రబాబు.. ఈసారి ఏకంగా హోంమంత్రిని చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పాయకరావుపేట నుంచి మరోసారి వంగలపూడి అనితకు అవకాశం ఇచ్చింది. అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ రికార్డు విక్టరీ కొట్టారు వంగలపూడి అనిత. స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులను కలుపుకుని వెళ్లి 2024 ఎన్నికల్లో పాయకరావు పేట అసెంబ్లీ స్థానం నుంచి 43,727 ఓట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకోవటమే కాకుండా.. హోం మంత్రిగా నియమితులయ్యారు.ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు వంగలపూడి అనిత. 2014కు ముందు టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనిత 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు పాయకరావుపేట ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆమెను.. పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు పంపింది. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయినా.. కూడా టీడీపీ కోసం వంగలపూడి అనిత పనిచేశారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తూ వైసీపీ విధానాలను ఎండగడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు.
టీచర్ టూ… హోమ్ మినిస్టర్..!
Related Posts
బాలికలకు విద్య అత్యంత ఆవశ్యకం….బాలికలను ఎదగనిద్దాం
●కౌమార దశ ఆడపిల్లల పై జరుగుతున్న దాడులను అరికట్టాలి.● అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా డాక్టర్ పసుపులేటి పాపారావు అందిస్తున్న ప్రత్యేక కథనం. దేశ భవిష్యత్తు పిల్లల పై ఆధారపడి ఉంటుంది. బాల బాలికలు జాతి సంపద. సమానత, స్వేచ్ఛ, గౌరవం, వారసత్వం, వ్యక్తిత్వం సార్వజనీనత వంటివి అందరికీ సమానంగా వర్తించే మానవ హక్కుల లక్షణాలు. కానీ నేటి మన దేశ పరిస్థితులలో బాలికలు వాళ్ళ హక్కులను పూర్తిగా…
Read moreసంతమైదానంలో ఆరెళ్ల బాలికపై అత్యాచారం…కేసు నమోదు
ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి-ప్రతినిధి):శ్రీకాళహస్తిలోని సంతమైదానంలో ఆరెళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది.వివరాలిలా వున్నాయి. స్థానిక కావమ్మ గుడి వీధికి చెందిన ఓ ఆరెళ్ల బాలికపై తొట్టంబేడు మండలంలోని జ్ఞానమ్మ కండ్రిగ గ్రామ ఆది ఆద్ర వాడకు చెందిన అంజూరు రామయ్య కుమారుడు బాలకన్న (25) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పపడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులుకు సమాచారం అందించ్చారు. పోలీసులు యువకుణ్ణి అరెస్ట్…
Read more