ప్రభాతదర్శిని,( నెల్లూరు-జిల్లా ప్రతినిధి): జిల్లా గ్రామ రెవెన్యూ అధికారులు సంఘం నాయకులు శుక్రవారం జిల్లా కలెక్టర్ ను కలిశారు.ఈ సందర్భంగా జిల్లా లోని గ్రామ రెవెన్యూ అధికారులు కు సంబంధించిన వివిధ అంశాలను, సమస్యలను జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్. కి అర్జీ ద్వారా విన్నవించారు. జిల్లా లోని వివిధ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న వి ఆర్ ఒ లకు రెవెన్యూ సంబంధిత పనులు అధికంగా ఉన్నాయి, అయినప్పటికి ఖాళీ ఇంటి స్థలం లకు పన్ను [వి ఎల్ టి] వసూలు కు వి ఆర్ ఒ లను వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ లు డ్యూటీ లు వేశారు. నీటి తీరువ వసూలు, నీటి సంఘాల ఎన్నికలు కు ఓటర్లు జాబితా తయారీ, రీ సర్వే గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు, చుక్కల భూములు, ఫ్రీ హోల్ అసైన్డ్ మెంట్ తదితర పనులలో తీరిక లేకుండా వి ఆర్ ఒ లు పని చేస్తున్నరని, ఖాళీ ఇంటి స్థలం లకు పన్ను [వి ఎల్ టి] వసూలు పనులు నుండి వి ఆర్ ఒ లను తప్పించాలని జిల్లా కలెక్టరు ని కోరగా వెంటనే వారు సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పంట అశోక్ కుమార్ రెడ్డి, కార్యదర్శి దారా రమణయ్య, డివిజన్ అధ్యక్షుడు యం నాగేశ్వరరావు, కార్యదర్శి తిరుమల రాజు, వి ఆర్ ఒ లు జగదీష్, రవి శేఖర్, రాజగోపాలు, విష్ణు, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.