ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి): జిల్లాలో ఉద్యాన వన నర్సరీ ఏర్పాటుకు పెన్నా, సంగం బ్యారేజ్ పరిసర లేక మరేదైనా ప్రాంతంలో అనువైన ప్రదేశంలో 5 సంవత్సరముల లీజు ప్రాతిపదికన అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. మంగళ వారం స్థానిక కలెక్టర్ కార్యాలయములోని యస్.ఆర్.శంకరన్ వీడియో కాన్ఫరెన్సు హాలులు ఉద్యాన వన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల ఉద్యాన వన శాఖ అధికారులు ఆయా మండలాలలో ఒక ప్రత్యేక థీం తో పనిచేసి ఆ మండలాలకు గుర్హింపు వచ్చేలా చూడాలన్నారు. నిర్దేశిత లక్ష్య సాధన కాకుండా వినూత్నంగా ఆలోచించ వలసిన అవసరం ఉందని, తదనుగుణంగా నెల్లూరు జిల్లా వైపు అందరిని ఆకర్షించేలా చేయాలన్నారు. వ్యవసాయ శాఖ ప్రాధాన్యతా రంగాలలో ఉద్యాన వన శాఖ ఒకటి అని అన్నారు. కలువాయి,సైదాపురం మరియు దుత్తలురులో ఉన్న కోల్డ్ స్టోరేజ్ లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఫాం పాండ్స్ ను పంచవలసిన అవసరం ఉందన్నారు. అంతే కాకుండా పాలీ హౌసెస్ లను పెంచాలని రాష్ట్రం మొత్తం నెల్లూరు వైపు చూసేలా ఉండాలన్నారు. ఉద్యాన వన అధికారులు శాస్త్రీయ దృక్పదం నుండి బయటికి వచ్చి వినూత్నంగా ఆలోచించి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. కొత్తదనం తో పెద్ద పెద్ద ఆలోచనలు చేసి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు, దానికి అవసరమైన నిధులు సమకూర్చడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఒక జిల్లా ఒక ప్రాడక్ట్ గా గుర్హింపు ఉండాలన్నారు. మోడరన్ నర్సరీలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. ఉద్యాన వస శాఖ సంబందిత శాఖలతో సమన్వయ పరచుకోవాలన్నారు. ప్రతి మండలం ఒక ఉద్యాన పంటల హబ్ గా ఉండలాన్నారు.ఈ కార్యక్రమములో డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్ట్ అధికారి నాగ రాజ కుమారి, మెప్మా అధికారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తొలుత జిల్లా ఉద్యాన శాఖ అధికారి రమణా రెడ్డి ఆ శాఖ అమలు చేస్తున్న పనుల పురోగతి పే పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసారు.

చిన్నారులందరికీ నులిపురుగుల నివారణ మాత్రలుఇప్పించాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రభాతదర్శిని ( నెల్లూరు – ప్రతినిధి): చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, ఎదుగుదలకు నులిపురుగుల నివారణ మాత్రలను తప్పనిసరిగా అందించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం ఉదయం నెల్లూరు నగరంలోని ఈ ఎస్ ఆర్ ఎం హైస్కూల్లో విద్యార్థులకు నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలను కలెక్టర్ అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సూచనల మేరకు 1-19 సంవత్సరాల వయసు గల బాల బాలికలు అందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా అందించాలన్నారు. ఈనెల 24న కూడా ఈ మాత్రల పంపిణీ జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. చిన్నారుల్లో ఎదుగుదల, మెరుగైన ఆరోగ్య సంరక్షణకు ఈ మాత్రలు ఎంతో ఉపయోగపడతాయని, తల్లిదండ్రులందరూ కూడా తమ బిడ్డలందరికీ ఈ మాత్రలను తప్పనిసరిగా అందించాలన్నారు. కలెక్టర్ వెంట డిఎంహెచ్వో డాక్టర్ సుజాత, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ యశ్వంత్, డెమో కనక రత్నం తదితరులు ఉన్నారు.

భాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):దేశంలో ప్రమాదకరమైన రాజకీయాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తుందని దేశ ప్రయోజనాలు దెబ్బతినే విధంగా బహుళజాతి సంస్థలకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తుందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)జాతీయ కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. మంగళవారం ఉదయం స్థానిక సూర్యకళామందిరం లో సీపీఐ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అభివృద్ధిపై దృష్టి చూపకుండా తిరుమల లడ్డు చుట్టూ రాజకీయాన్ని నిర్వహిస్తున్నారన్నారు. కల్తీ జరిగిందని నివేదిక వస్తే దానికి సంబంధించిన బాధ్యులపైన, అక్రమంగా కోట్లాది రూపాయలు దోపిడీ చేసిన వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు 30 ఏళ్ల క్రితం 4000 కోట్లతో వెలుగోడు ప్రాజెక్టును సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించారని అది నేటికీ పూర్తికాలేదన్నారు. ఈ విధంగా ఎన్నో సాగు నీటి ప్రాజెక్టులు అసంపూర్తిగానే ఆగి ఉన్నాయన్నారు. అలాగే ఇంకా ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు ఒరిస్సా సరిహద్దుల్లో ఆగిపోయన్నారు. రంగ అభివృద్ధికి స్వాగినేటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయని అది రాష్ట్రానికి వినియోగించుకోని యువతకు ఉపాధి కల్పనకు ప్రణాళికలను రూపొందించాలన్నారు. తిరుమల లడ్డుపై చంద్రబాబు, జగన్, పవన్ నాటకాలు ఆపి త్వరితగతిన చర్యలను బాధ్యులపై చేపట్టాలన్నారు. రాష్ట్రంలో నాలుగు సమ్మెట్ల ద్వారా 80 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న ప్రభుత్వాలు అవి ఎంతవరకు అమలు జరిగాయో బహిర్గతం చేయాలన్నారు. రాష్ట్రంలో మహిళ, యువత, కార్మిక, సమస్యలను పరిష్కారం కోసం పోరాటం చేసి సీపీఐ బలోపేతానికి కృషి చేస్తామని ఈశ్వరయ్య చెప్పారు. సిపిఐ సీనియర్ నేత కె రామకృష్ణ మాట్లాడుతూ పూర్తి వ్యవసాయ ఆధారితమైన దేశంలో వ్యవసాయానికి తీవ్ర నష్టం చేసే విధంగా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అమెరికా నుండి దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తులకు సుంకం లేకుండా గాను అనుమతిచ్చి రైతులను, రైతు ఉత్పత్తులను నాశనం చేస్తుందన్నారు. అమెరికాకు తొత్తుగా మోడీ వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు. మన దేశ నిర్ణయాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడం దానికి మోడీ ఖండించకపోవడం పలు అనుమానాలు తావిస్తోందన్నారు. ప్రపంచాన్ని కుదిపేసిన ఎఫ్స్టీన్ ఫైల్స్ బహిర్గత అయిన తర్వాత మోడీపై ట్రంప్ మాటల దాడిని పెంచినా అతను స్పందించడం లేదన్నారు. కేంద్ర బడ్జెట్ 53 లక్షల నలభై వేల కోట్లతో ప్రవేశపెట్టారని అందులో 14 లక్షల కోట్లు వడ్డీ కట్టడాన్ని బట్టి చూస్తే దేశం మరింత అప్పుల ఊబిలోకి కూరుకు పోతుందని చెప్పారు. 2014లో దేశం అప్పు 55 లక్షల కోట్లు ఉండగా అది ప్రస్తుతం 214 లక్షల కోట్లకు చేరిందన్నారు. దీన్ని బట్టి చూస్తే దేశం ఏ విధంగా ముందుకు పోతుందో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పేదలకు అవసరమయ్యే వైద్యాన్ని ప్రైవేటుపరం చేయడం తగదన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని వసతుల కల్పించి మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం ఎక్కడా లేదన్నారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఈనెల 25, 26 తేదీల్లో ఢిల్లీలో జాతీయ కార్యవర్గంలో జరిగే సమావేశం చర్చిస్తామన్నారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీని నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ 25, 26 తేదీల్లో అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఆందోళన నిర్వహిస్తామని రామకృష్ణ చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య అక్కినేని వనజ, ముప్పాళ్ల నాగేశ్వరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి కే బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.