*ఫోర్త్ ఎస్టేట్ ముందున్న మూడు ఎస్టేట్స్ ఏవి… అనే విషయాన్ని తెలుసుకుందాం.. మానవ మనుగడకు, ప్రగతికి ఈ దేశ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాలుగు స్తంభాలుగా ఉన్న వ్యవస్థల్లో జర్నలిజం (ఫోర్త్ ఎస్టేట్) అనేది ప్రధాన మైనది. మరి ఈ ఫోర్త్ ఎస్టేట్ (జర్నలిజం) కన్నా ముందున్న ఆ మూడు స్తంభాలు అనేది మనలో చాలా మందికి తెలియదు. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఈ నాలుగు స్తంభాలు ఎంతో అవసరం. (1)శాసన రంగం.(Legislature), (2)పాలనా రంగం (Executive, (3)న్యాయశాఖ (Judiciary, (4) పత్రిక రంగం- వర్కింగ్ జర్నలిస్టు (Journalism work) ఈ నాలుగు ఎస్టేట్స్ మనదేశ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాలుగు స్థంభాలుగా ఉన్నాయి. వాటి వివరణ కూడా క్లుప్తంగా తెలుసు కుందాం. (1)శాసన రంగం*: ప్రతి రాష్ట్రానికి ఒక శాసనసభ ఉంటుంది.ఎన్ని కైన రాష్ట్ర ఎమ్మెల్యేలు, అలాగే శాసనమండలి సభ్యులు లేదా? మహిళలు ఇలా ప్రజా ప్రతి నిధులతో రూపొందించబడింది. ఇది ఫస్ట్ ఎస్టేట్ గా ఉంది.*(2)పాలనా రంగం*:ఎగ్జిక్యూటివ్ అనేది అధికార ప్రభుత్వంలో నిర్వాహక లేదా పర్యవేక్షక అధికారం కలిగి ఉన్న వ్యక్తి లేదా ?కొద్దిమంది వ్యక్తుల సమూహాన్ని సూచిస్తుంది. కార్యనిర్వాహకుడు సీఎం ప్రభు త్వపరంగా చట్టాన్ని,(జి.ఓ) లు అమలు చేయడానికి మరియు అమలు పరచడానికి బాధ్యత వహిస్తాడు. దీనినే సెకండ్ ఎస్టేట్ గా పిలుస్తారు.*(3)న్యాయశాఖ*: దేశంలో పలు రాష్ట్రాలుగా ఉన్న అక్కడి ప్రభుత్వాల పరిధిలో ఉన్న ప్రభుత్వ మొత్తం భాగం ఆ పరిధిలో న్యాయ వ్యవస్థకు బాధ్యత వహిస్తుంది. దాని న్యాయ స్థానాలలో న్యాయమూర్తు లందరినీ కలిగి ఉంటుంది. దీనినే థర్డ్ ఎస్టేట్ అని అంటారు. *(4)వర్కింగ్ జర్నలిస్ట్*: జర్నలిజం అనగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా సత్వర సందేశాలు,ఫోటోలు, వీడియోల రూపంలో సేకరించి ఆ సమాచారాన్ని పత్రిక, లేదా టివీల ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమాచారాన్ని విస్తృతపరిచే విధానాన్ని జర్నలిజం అంటారు. దీనినే ఫోర్త్ ఎస్టేట్ అని కూడా పిలుస్తారు. ఈ ఫోర్త్ ఎస్టేట్ ప్రతినిధులను కూడా జర్నలిజం రంగంలో వర్కింగ్ జర్నలిస్టులుగా ఉన్న వారిని మాత్రమే ఫోర్త్ ఎస్టేట్ ప్రతినిధిగా గుర్తిస్తారు. దేశంలో ఉన్న అన్ని రంగాలలో జర్నలిజం ఎందుకు ఫోర్త్ ఎస్టేట్ అయ్యింది అంటే దీనికి ప్రతినిధులుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఒక ప్రత్యేక మైన గుర్తింపు కలిగి నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజల అవసరాలను,ప్రభుత్వ విధానాలకు అనుసం ధానం చేసే వారధిగా జర్నలిస్టులను ప్రభుత్వం రెండున్నర శతాబ్దాల క్రితమే గుర్తించింది. ఇంతటి గౌరవ ప్రదమైన హోదాతో ఎంతోమంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారం కొరకు పాటుపడుతున్న రంగం జర్నలిజం.
జర్నలిజం -జర్నలిస్టులు ఫోర్త్ ఎస్టేట్ ఎలా అయ్యారు?
Related Posts
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 119 మొబైల్ యాప్స్ బ్యాన్!
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 119 మొబైల్ యాప్స్ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిషేధించిన చాలా యాప్లు ప్రస్తుతం డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. నివేదిక ప్రకారం, ఇప్పటివరకు గూగుల్ ప్లే స్టోర్ నుండి 15 యాప్లను మాత్రమే తొలగించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరోసారి చైనా లింక్డ్ మొబైల్ యాప్లపై డిజిటల్ స్ట్రైక్ చేసింది. ప్రభుత్వం ఒకేసారి 119 చైనీస్ మొబైల్ యాప్లను…
Read moreఏపీ, ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారు:ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన
ఓటేసిన పాపానికి ప్రజలను ఏపీలో వైసీపీ కాటేశారు: చంద్రబాబు స్పందనప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి):ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఉండవల్లిలోని నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ గెలుపు, కేవలం ఢిల్లీ ప్రజల గెలుపు కాదని… ఇది దేశ ప్రజల గెలుపు కూడా అని అభివర్ణించారు. పీపుల్స్ ఫస్ట్ అనే మోడల్ మాత్రమే పని చేస్తుందని ఈ ఎన్నిక మరోసారి…
Read more