ఇంటర్‌-కాలేజియేట్ టోర్నమెంట్ ముగింపులో ఎస్వీయూ వైస్ ఛాన్సలర్
ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): క్రీడలు మానసిక ఉల్లాసానికి అవసరమని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ విజయభాస్కరరావు అన్నారు. వెంకటాచలం మండలం కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఇంటర్‌కాలేజియేట్ పురుషుల క్రీడల టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌లో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు విద్యార్థుల శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అవసరమన్నారు. క్రీడల ద్వారా విద్యార్థులు ఏకాగ్రత, సహనం, జట్టుగా పనిచేసే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చునని తెలిపారు. విజయం మాత్రమే కాదు, పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడికి క్రీడాస్ఫూర్తి చాలా ముఖ్యమైని అన్నారు. మన విశ్వవిద్యాలయం ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి అవసరమైన మద్దతు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటుంది,” అని పేర్కొన్నారు. అంతేకాక అన్ని కళాశాల క్రీడకారులు అంతర్ విశ్వవిద్యాలయాల పోటిలలో బహుమతులు సాదించాలని అన్నారు. ఇది వారి ప్రతిభను ప్రదర్శించేందుకు, విశ్వవిద్యాలయ గౌరవాన్ని మరింత పెంచేందుకు ఒక చక్కని అవకాశం” అని ఆయన సూచించారు.
విజేతలు మరియు రన్నర్ల వివరాలు:బాస్కెట్‌బాల్,విజేతలు: జెబి డిగ్రీ కాలేజ్, కావలి, రన్నర్లు: వీఎస్యూ కాలేజ్, కావలిచెస్ విజేతలు: జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్, నెల్లూరు, రన్నర్లు: వీఎస్యూ కాలేజ్, నెల్లూరు సాఫ్ట్ బాల్ విజేతలు: డాక్టర్ ఎస్.ఆర్.జె. డిగ్రీ కాలేజ్, ఆత్మకూరు రన్నర్లు: వీఎస్యూ కాలేజ్, నెల్లూరు హ్యాండ్ బాల్ విజేతలు: జెబి డిగ్రీ కాలేజ్, కావలి రన్నర్లు: వీఎస్యూ కాలేజ్, నెల్లూరు, ఉత్తమ శరీరాకృతి (బెస్ట్ ఫిజిక్),విజేతలు: వీఎస్యూ కాలేజ్, నెల్లూరు రన్నర్లు: జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్, నెల్లూరు పాల్గొన్న బృందాల సంఖ్య:బాస్కెట్‌బాల్: 7, చెస్:18, సాఫ్ట్ బాల్:18,హ్యాండ్ బాల్: 8, ఉత్తమ శరీరాకృతి: 7, ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత, ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. విజయ, స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ సి.హెచ్. వెంకటరాయులు, టోర్నమెంట్ నిర్వాహకులు డాక్టర్ పి. నారాయణరాజు, విశ్వవిద్యాలయ పిడి డాక్టర్ ఏ. ప్రవీణ్ కుమార్, ఇతర కోచ్‌లు, మరియు ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.