ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి -ప్రతినిధి): శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈఓ చంద్ర శేఖర్ ఆజాద్ గాడి తప్పిన, భక్తులను అడ్డదారిలో దర్శనం కోసం తీసుకెళ్లే ఆలయంలో పనిచేసే సిబ్బందికి సి సి కెమెరాల నిఘా ధ్వారా, స్వీయ పర్యవేక్షణ ద్వారా దొరికినోళ్లును దొరికి నట్టు సస్పెండ్ చేస్తున్నారు. దీంతో ఈఓ పరిపాలనకు, గత ఈఓల పాలనకు వ్యవత్యాసం కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. అయినా అలవాటు పడ్డ జీవులు అక్రమంగా భక్తులను దర్శనం కోసం తీసుకుని వెళ్లి జేబులు నింపుకునే ఆలయ ఉద్యోగులు, సిబ్బందికి ఈఓ విశ్వరూపంతో బేంబేలు ఎత్తుతున్నారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది, ఎస్ పి ఎఫ్, హోం గార్డులు , కోర్టు సిబ్బంది మాత్రం ఇష్టారాజ్యాంగం వ్యవహరిస్తూ ఉన్నారానే విమర్శలు మాత్రం ఆగడం లేదు. అందువల్ల ఈఓ అలాంటి వారి పట్ల ఓ కన్నేసి ఉంచాలని స్థానిక భక్తులు కోరుతున్నారు. అర్చకులు, పూజార్లుకు విధులుపై అవగాహన కల్పించిన ఈఓ వారికి కూడా దశల వారీగా ఆలయం ప్రతిష్ట పెంచడానికి తగు చర్యలు చేపట్టాల్సి వుంది. ఈఓగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచే ప్రక్షాళనకు నడుం బిగించి కట్టు, బొట్టు, జుట్టు వంటి సాంప్రదాయం అమలు చేస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. పాలనా పరమైన ఆదేశాలు జారీ చేయడంతోపాటు ఈ ఓ చంద్రశేఖర్ ఆజాద్ తాను పద్దతిగా నడుచుకుంటూ క్రమంగా సిబ్బందిలో మార్పుకు శ్రీకారం చుట్టారు. మొత్తం మీద ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ పరిపాలనా విధానాలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఇలాంటి ఈ ఓ మరి కొంత కాలం ఇక్కడే ఉంటే భక్తులు హాయిగా రాహు కేతు, ఆర్జిత సేవలు, అభిషేకలు చేసుకోవడం తథ్యం.
కీలుచూసి వాతవేస్తున్న ముక్కంటి ఈఓ…వరుస సస్పెండ్లతో దళారి దర్శన పార్టీల బెంబెలు
Related Posts
సూళ్లూరుపేట నియోజక వర్గ యువజన, రైతు విభాగం అధ్యక్షులుగా పాలేటి నాగార్జున, కట్ట భవాని శంకర్ రెడ్డిలు
ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులుగా కట్టా భవాని శంకర్ రెడ్డిని వైసిపి అధిష్టానం నియమించింది. విజయ డైరీ డైరెక్టర్ గా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం సూళ్లూరుపేట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయనను నియోజకవర్గ వైసిపి రైతు విభాగం అధ్యక్షులుగా నియమించింది. నియోజకవర్గ వైసిపి రైతు విభాగం అధ్యక్షులుగా…
Read moreప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా చూడాలి…జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత
ప్రతి గర్భిణీ స్త్రీని గుర్తించి నమోదు చేయాలిప్రభాతదర్శిని,(నెల్లూరు – ప్రతినిధి): ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా ఆరోగ్య సిబ్బంది చైతన్యం కలిగించాలని నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత పేర్కొన్నారు. గురువారంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాII వి. సుజాత అధ్యక్షతన “ శిశు మరణాల సబ్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో2024…
Read more