ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి -ప్రతినిధి): శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈఓ చంద్ర శేఖర్ ఆజాద్ గాడి తప్పిన, భక్తులను అడ్డదారిలో దర్శనం కోసం తీసుకెళ్లే ఆలయంలో పనిచేసే సిబ్బందికి సి సి కెమెరాల నిఘా ధ్వారా, స్వీయ పర్యవేక్షణ ద్వారా దొరికినోళ్లును దొరికి నట్టు సస్పెండ్ చేస్తున్నారు. దీంతో ఈఓ పరిపాలనకు, గత ఈఓల పాలనకు వ్యవత్యాసం కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. అయినా అలవాటు పడ్డ జీవులు అక్రమంగా భక్తులను దర్శనం కోసం తీసుకుని వెళ్లి జేబులు నింపుకునే ఆలయ ఉద్యోగులు, సిబ్బందికి ఈఓ విశ్వరూపంతో బేంబేలు ఎత్తుతున్నారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది, ఎస్ పి ఎఫ్, హోం గార్డులు , కోర్టు సిబ్బంది మాత్రం ఇష్టారాజ్యాంగం వ్యవహరిస్తూ ఉన్నారానే విమర్శలు మాత్రం ఆగడం లేదు. అందువల్ల ఈఓ అలాంటి వారి పట్ల ఓ కన్నేసి ఉంచాలని స్థానిక భక్తులు కోరుతున్నారు. అర్చకులు, పూజార్లుకు విధులుపై అవగాహన కల్పించిన ఈఓ వారికి కూడా దశల వారీగా ఆలయం ప్రతిష్ట పెంచడానికి తగు చర్యలు చేపట్టాల్సి వుంది. ఈఓగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచే ప్రక్షాళనకు నడుం బిగించి కట్టు, బొట్టు, జుట్టు వంటి సాంప్రదాయం అమలు చేస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. పాలనా పరమైన ఆదేశాలు జారీ చేయడంతోపాటు ఈ ఓ చంద్రశేఖర్ ఆజాద్ తాను పద్దతిగా నడుచుకుంటూ క్రమంగా సిబ్బందిలో మార్పుకు శ్రీకారం చుట్టారు. మొత్తం మీద ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ పరిపాలనా విధానాలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఇలాంటి ఈ ఓ మరి కొంత కాలం ఇక్కడే ఉంటే భక్తులు హాయిగా రాహు కేతు, ఆర్జిత సేవలు, అభిషేకలు చేసుకోవడం తథ్యం.
కీలుచూసి వాతవేస్తున్న ముక్కంటి ఈఓ…వరుస సస్పెండ్లతో దళారి దర్శన పార్టీల బెంబెలు
Related Posts
కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ని విమర్శించే అర్హత కూటమి నేతలకు లేదు- పెళ్ళకూరు వైసీపీ జడ్పిటిసి సభ్యులు నన్నం ప్రిస్కిల్లా
ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ని విమర్శించే అర్హత కూటమి పార్టీ నాయకులకు లేదని పెళ్లకూరు మండల జడ్పిటిసి సభ్యులు నన్నం ప్రిస్కిల్లా అన్నారు.శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనేకమంది కార్యకర్తలకు రాజకీయ ఓనమాలు నేర్పి తిరుగులేని నేతగా ఎదిగిన వైసీపీ నేత కామిరెడ్డి…
Read moreచంద్రబాబు స్వార్థ రాజకీయాలకు దేవుణ్ణి అడ్డుపెట్టుకుంటున్నారు -మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని రాజకీయ డ్రామాకు తెర లేపారని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. శుక్రవారం ఆయన తిమ్మాజీ కండ్రిక వద్ద స్వర్ణముఖి నది తీరాన వెలసి ఉన్న శ్రీ అభయా అనుగ్రహ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్థానిక వైసీపీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
Read more