ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి -ప్రతినిధి): శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈఓ చంద్ర శేఖర్ ఆజాద్ గాడి తప్పిన, భక్తులను అడ్డదారిలో దర్శనం కోసం తీసుకెళ్లే ఆలయంలో పనిచేసే సిబ్బందికి సి సి కెమెరాల నిఘా ధ్వారా, స్వీయ పర్యవేక్షణ ద్వారా దొరికినోళ్లును దొరికి నట్టు సస్పెండ్ చేస్తున్నారు. దీంతో ఈఓ పరిపాలనకు, గత ఈఓల పాలనకు వ్యవత్యాసం కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. అయినా అలవాటు పడ్డ జీవులు అక్రమంగా భక్తులను దర్శనం కోసం తీసుకుని వెళ్లి జేబులు నింపుకునే ఆలయ ఉద్యోగులు, సిబ్బందికి ఈఓ విశ్వరూపంతో బేంబేలు ఎత్తుతున్నారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది, ఎస్ పి ఎఫ్, హోం గార్డులు , కోర్టు సిబ్బంది మాత్రం ఇష్టారాజ్యాంగం వ్యవహరిస్తూ ఉన్నారానే విమర్శలు మాత్రం ఆగడం లేదు. అందువల్ల ఈఓ అలాంటి వారి పట్ల ఓ కన్నేసి ఉంచాలని స్థానిక భక్తులు కోరుతున్నారు. అర్చకులు, పూజార్లుకు విధులుపై అవగాహన కల్పించిన ఈఓ వారికి కూడా దశల వారీగా ఆలయం ప్రతిష్ట పెంచడానికి తగు చర్యలు చేపట్టాల్సి వుంది. ఈఓగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచే ప్రక్షాళనకు నడుం బిగించి కట్టు, బొట్టు, జుట్టు వంటి సాంప్రదాయం అమలు చేస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. పాలనా పరమైన ఆదేశాలు జారీ చేయడంతోపాటు ఈ ఓ చంద్రశేఖర్ ఆజాద్ తాను పద్దతిగా నడుచుకుంటూ క్రమంగా సిబ్బందిలో మార్పుకు శ్రీకారం చుట్టారు. మొత్తం మీద ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ పరిపాలనా విధానాలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఇలాంటి ఈ ఓ మరి కొంత కాలం ఇక్కడే ఉంటే భక్తులు హాయిగా రాహు కేతు, ఆర్జిత సేవలు, అభిషేకలు చేసుకోవడం తథ్యం.
కీలుచూసి వాతవేస్తున్న ముక్కంటి ఈఓ…వరుస సస్పెండ్లతో దళారి దర్శన పార్టీల బెంబెలు
Related Posts
ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం:నెల్లూరు కార్పొరేషన్, నుడా అధికారుల సమీక్షలో మంత్రి నారాయణ
ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి):కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి పలు అంశాలపై కార్పొరేషన్, నుడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఎల్ ఆర్ ఎస్, బీఆర్ ఎస్ దరఖాస్తులపై మంత్రి ఆరా తీశారు. లే ఔట్ల…
Read moreసానుకూల దృక్పథంతోనే విజయాలు సాధ్యం…. ఎన్ఎస్ఎస్ అవగాహన కార్యక్రమంలో విక్రమ సింహపురి వర్సిటీ వీసీ శ్రీనివాసరావు
ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి): సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా, సానుకూల దృక్పథంతో వాటిని ఎదుర్కొంటే విజయం సాధించడం సులభమని ప్రముఖ బాల మనోవైద్య నిపుణులు డాక్టర్ వి. సురేశ్ బాబు స్పష్టం చేశారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ యూనిట్–1 ఆధ్వర్యంలో వెంకటాచలం మండలం, చెముడుగుంట గ్రామంలో పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న డాక్టర్ సురేశ్…
Read more