ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి -ప్రతినిధి): శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈఓ చంద్ర శేఖర్ ఆజాద్ గాడి తప్పిన, భక్తులను అడ్డదారిలో దర్శనం కోసం తీసుకెళ్లే ఆలయంలో పనిచేసే సిబ్బందికి సి సి కెమెరాల నిఘా ధ్వారా, స్వీయ పర్యవేక్షణ ద్వారా దొరికినోళ్లును దొరికి నట్టు సస్పెండ్ చేస్తున్నారు. దీంతో ఈఓ పరిపాలనకు, గత ఈఓల పాలనకు వ్యవత్యాసం కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. అయినా అలవాటు పడ్డ జీవులు అక్రమంగా భక్తులను దర్శనం కోసం తీసుకుని వెళ్లి జేబులు నింపుకునే ఆలయ ఉద్యోగులు, సిబ్బందికి ఈఓ విశ్వరూపంతో బేంబేలు ఎత్తుతున్నారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది, ఎస్ పి ఎఫ్, హోం గార్డులు , కోర్టు సిబ్బంది మాత్రం ఇష్టారాజ్యాంగం వ్యవహరిస్తూ ఉన్నారానే విమర్శలు మాత్రం ఆగడం లేదు. అందువల్ల ఈఓ అలాంటి వారి పట్ల ఓ కన్నేసి ఉంచాలని స్థానిక భక్తులు కోరుతున్నారు. అర్చకులు, పూజార్లుకు విధులుపై అవగాహన కల్పించిన ఈఓ వారికి కూడా దశల వారీగా ఆలయం ప్రతిష్ట పెంచడానికి తగు చర్యలు చేపట్టాల్సి వుంది. ఈఓగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచే ప్రక్షాళనకు నడుం బిగించి కట్టు, బొట్టు, జుట్టు వంటి సాంప్రదాయం అమలు చేస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. పాలనా పరమైన ఆదేశాలు జారీ చేయడంతోపాటు ఈ ఓ చంద్రశేఖర్ ఆజాద్ తాను పద్దతిగా నడుచుకుంటూ క్రమంగా సిబ్బందిలో మార్పుకు శ్రీకారం చుట్టారు. మొత్తం మీద ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ పరిపాలనా విధానాలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఇలాంటి ఈ ఓ మరి కొంత కాలం ఇక్కడే ఉంటే భక్తులు హాయిగా రాహు కేతు, ఆర్జిత సేవలు, అభిషేకలు చేసుకోవడం తథ్యం.
కీలుచూసి వాతవేస్తున్న ముక్కంటి ఈఓ…వరుస సస్పెండ్లతో దళారి దర్శన పార్టీల బెంబెలు
Related Posts
పత్రికారంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది
పాత్రికేయుల సమస్యలను సానుకూల ధృక్పధంతో పరిష్కారిస్తాంఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర మహాసభలలో మంత్రులుప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): పత్రికారంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూల ధృక్పధంతో ఉన్నారని పలువురు రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయుడబ్ల్యుజే) 36వ రాష్ట్ర మహాసభ బుధవారం ఒంగోలు దక్షిణ బైపాస్ లోని విష్ణుప్రియ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఏపీయుడబ్ల్యుజే…
Read moreవిశ్వసనీయతకే మరో మారు పట్టం…వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఓడూరు గిరిధర్ రెడ్డి
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఓడూరు గిరిధర్ రెడ్డి రెండోసారి ఎంపికయ్యారు. జగన్మోహన్ రెడ్డి కి విశ్వసనీయుడుగా పార్టీ ఆవిర్భావం మునుపునుండే అనుబంధం ఉన్న కారణంగా గిరిధర్ రెడ్డికి ఈ పదవి దక్కింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి తో ఓడూరు గిరిధర్ రెడ్డి కి ఉన్న అనుబంధం వీడదీయరానిదని చెప్పవచ్చు. 2004 సంవత్సరం నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ స్టేట్…
Read more