ప్రభాతదర్శిని, (పుత్తూరు-ప్రతినిధి):
తిరుపతి రూరల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ కు వడమాలపేట,పుత్తూరు ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు ఘనంగా సన్మానించారు. పుత్తూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంకు వెళ్లిన తిరుపతి రూరల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ కు వారు ఘన స్వాగతం పలికారుఈ సందర్భంగా ఆయనకు శాలవాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభలో భాగస్వామ్యం కావాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు,సభ్యులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా గౌరవ అధ్యక్షులు జక్క సుబ్బరాజు,చిన్న రామ సత్యనారాయణ,పి తులసి, గూడూరు కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కిషోర్ కుమార్ కు ఆర్యవైశ్య మహాసభ నేతల ఘన సన్మానం
Related Posts
చెరువులను గుల్ల చేస్తూ…వెంచర్లకు అక్రమంగా గ్రావెల్ తరలింపు
అవినీతిలో పెళ్ళకూరు ఇరిగేషన్ ఏ.ఈ.రూటే సపరేట్… చెరువుమట్టిని మింగేస్తున్న అవినీతి తిమింగలం ప్రభాతదర్శిని,(తిరుపతి ప్రత్యేక-ప్రతినిధి):పెళ్లకూరు మండలంలో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఏఈ రూటే సపరేట్ గా ఉంది. చెరువుల అభివృద్ధికి కృషి చేయవలసిన ఆ అధికారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెరువులో మట్టిని మింగేస్తున్నాడని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకులను స్వామి భక్తితో ఆకట్టుకుంటూ పెళ్లకూరు మండలంలోని వివిధ చెరువులో మట్టిని…
Read moreఅడుగుకోక గతుకు…ఏమౌతుందో బ్రతుకు…
అధ్వాన్నంగా కోట ఆర్ అండ్ బి రోడ్లు…నిద్రావస్థలో అధికారులు…. పాలకులు ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): రాజకీయ పరిభాషలో కోట – వాకాడు మండలాలు రాజకీయాల నిలయంగా ప్రాచుర్యం ఉంది. ఒకప్పుడు రవాణాకు సరైన మార్గాలు లేని రోజులలో కోట వాకాడు నుండి రాజకీయాలు నడిపిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయా ప్రాంతాల అభివృద్ధికి వారి వారి స్థాయిలో ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా…
Read more