ప్రభాతదర్శిని, (పుత్తూరు-ప్రతినిధి):
తిరుపతి రూరల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ కు వడమాలపేట,పుత్తూరు ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు ఘనంగా సన్మానించారు. పుత్తూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంకు వెళ్లిన తిరుపతి రూరల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ కు వారు ఘన స్వాగతం పలికారుఈ సందర్భంగా ఆయనకు శాలవాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభలో భాగస్వామ్యం కావాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు,సభ్యులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా గౌరవ అధ్యక్షులు జక్క సుబ్బరాజు,చిన్న రామ సత్యనారాయణ,పి తులసి, గూడూరు కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.