ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ని విమర్శించే అర్హత కూటమి పార్టీ నాయకులకు లేదని పెళ్లకూరు మండల జడ్పిటిసి సభ్యులు నన్నం ప్రిస్కిల్లా అన్నారు.శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనేకమంది కార్యకర్తలకు రాజకీయ ఓనమాలు నేర్పి తిరుగులేని నేతగా ఎదిగిన వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని కూటమి పార్టీ నాయకులు విమర్శించడాన్ని ఆమె ఖండించారు.ఇంటికో బెల్ట్ షాపు నిర్వహిస్తూ మద్యాన్ని ఏరులై పారిస్తూ, ప్రజల ఆరోగ్యాలను కాలరాస్తూ దోచుకుంటున్న కూటమి నాయకులు సత్యనారాయణ రెడ్డిని విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆమె అన్నారు.తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.ఈ కార్యక్రమంలో పెళ్ళాకూరు ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్ రెడ్డి,వైస్ ఎంపీపీ సుధారాణి,వైసిపి పెళ్లకూరు మండల కన్వీనర్ ఒబ్బు వెంకటయ్య,సూళ్లూరుపేట నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు పాలేటి నాగార్జున, వైసిపి నాయకులు నల్లు మోహన్,బాలు,ఆనంద్,కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.