ప్రభాతదర్శిని (ఓజిలి- ప్రతినిధి): ఓజిలి మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన కె. స్వప్నని మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాదర్తి ప్రకాష్ నాయుడు మంగళవారం పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఐ కు పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించి, స్వీట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని ప్రజలకు సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.