ప్రభాతదర్శిని, (శ్రీకాళహస్తి – ప్రతినిధి ): ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ శ్రీకాళహస్తి నియోజకవర్గ కమిటీని శనివారం ఎన్నుకున్నారు. స్థానిక శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శనివారం జరిగిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వళిగలం గోపి, జిల్లా కన్వీనర్ తులసీ రామ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కావేరిపాకం వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా పెరిమిడి రఘు, ఉపాధ్యక్షులుగా బాలు(బాబు), మునిచంద్ర, కోశాధికారిగా చక్రపాణి, సహాయ కార్యదర్శిగా బాలచంద్ర ఎన్నికయ్యారు. వీరితో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు, హక్కుల సాధనకై పెడరేషన్ పోరాడుతుందని అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. జర్నలిస్టు సమస్యల పోరాటానికై మార్చి 4న జరిగే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణు గోపాల్, సీనియర్ పాత్రికేయులు బాలచంద్ర , కామేష్, హరిబాబు, ధనశేఖర్, హకీం తదితరులు పాల్గొన్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.