ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన డాక్టర్ పేరంశెట్టి రమేశ్‌ బాబు (64) దుండగుడు జరిపిన కాల్పుల్లో చినిపోయాడు. నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన టిడిపి నేత,మాజీ ఎంపీటీసీ సభ్యులు పెరంశెట్టి రామయ్య సోదరుడు డాక్టర్ రమేష్ బాబు (64)అమెరికా లో స్థిరపడ్డారు. ఆయన శుక్రవారం అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతి నట్లు తెలిసింది. ప్రస్తుతం మృతి చెందిన డాక్టర్ రమేష్ బాబు సోదరుడు టిడిపి నేత పెరంశెట్టి రామయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి తమ్ముడు వద్ద అమెరికాలో ఉన్నారు. తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో చదివిన డాక్టర్ రమేష్ బాబు అమెరికాలో తస్కలూసా ప్రాంతంలో డాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో పలు ఆస్పత్రులు నిర్మించి సేవలందిస్తున్నారు రమేష్ బాబు. ఆమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయి మంచి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియా నుంచి ఆమెరికాకు వెళ్లే రాజకీయ ప్రముఖులకు తన ఇంట్లో ఆతిథ్యమిచ్చేవారు రమేష్ బాబు. రమేశ్‌ బాబు సేవలకు గుర్తింపుగా అక్కడ ఓవీధికి ఆయన పేరు పెట్టారు. ఈయన భార్య కూడా వైద్యురాలే. వీరికి ఇద్ద