ప్రభాతదర్శిని, (దిల్లీ ప్రత్యేక-ప్రతినిధి): రోగులకు ముప్పుతెచ్చే అవకాశం ఉందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం 156 రకాల ఔషధాలను నిషేధించింది. వీటిని ప్రధానంగా జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీలకు మందులుగా వాడుతుంటారు. స్థిర మోతాదులో రెండు, అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్థాలను కలిపి వాడే మందులను (కాంబినేషన్ డ్రగ్స్ను) కాక్టెయిల్ డ్రగ్స్ అని కూడా వ్యవహరిస్తారు. ఎసెక్లోఫెనాక్ 500 ఎంజీ + పారాసెటమాల్ 125 ఎంజీ మాత్రలను, మెఫెనమిక్ యాసిడ్ + పారాసెటమాల్ ఇంజెక్షన్, సెట్రిజెన్ హెచ్సీఎల్+ పారాసెటమాల్+ ఫినైలెప్రైన్ హెచ్సీఎల్, లెవొసెట్రిజిన్+ ఫినైలెప్రైన్ హెచ్సీఎల్+ పారాసెటమాల్ వంటివి నిషేధిత మందుల జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు ఉండగా ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) ఔషధాలను వాడడం ప్రమాదాన్ని ఆహ్వానించడమే అవుతుందని అందులో పేర్కొన్నారు.
156 ఔషధాలపై కేంద్రం నిషేధం… జాబితాలో జ్వరాలు, నొప్పులు, ఎలర్జీలకు వాడే మందులు
Related Posts
పరిపాలన దక్షతను చాటుకున్న చంద్రబాబు…విమర్శలకే పరిమితమైన విపక్షం
వరద రాజకీయాలపై వైకాపాలో అంతర్మథనంప్రభాతదర్శిని,(పొలిటికల్-బ్యూరో): ఎపిలో వరదలతో విజయవాడ సహా పలు జిల్లాలలు అతలాకుతలం అయ్యాయి. ప్రధానంగావిజయవాడ కోలుకోలేని దెబ్బతిన్నది. సిఎం చంద్రబాబు తన దక్షతతో వరదబాధితులను ఆదుకుని, వారికి అండగా నిలిచారు.కానీ విపక్ష వైకాపా కేవంల విమర్శలకు పరిమితం అయి, ఇదో మానవతప్పిదమని అంటూ విమర్శలు చేస్తోంది. వరద బాధితులను ఆదుకోలేదు. సహాయ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు. కానీ జగన్ మాత్రం పలు ప్రాంతాల్లో పర్యటించి అధికారపార్టీపై…
Read moreమంత్రి నారాయణ ను కలిసిన నాయుడుపేట టిడిపి నేతలు
ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ను శనివారం టిడిపి నేతలు నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ,టిడిపి నేత నెలవల రాజేష్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.నెల్లూరులోని మంత్రి నారాయణ నివాసంలో ఆయనను కలిసిన వారు మంత్రి నారాయణ కు శాలువాలు కప్పి,పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ పరిధిలో పలు సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకువచ్చారు.…
Read more