ప్రభాతదర్శిని,(తొట్టంబేడు-ప్రతినిధి):శ్రీకాళహస్తి లో ఉన్న ఇన్ఫినిటీ ఫిన్ కార్ప్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబై వారు సిఎస్ఆర్ ప్రోగ్రాం ద్వారా కన్నలి పాఠశాలలకు అవసరమైన దాదాపు ఒక్క లక్ష యాభైవేల విలువచేసే కుర్చీలు, టేబుల్స్, బీరువాలు ,వాటరు ఆర్వో సిస్టం ,మరియు విద్యార్థులకు అవసరమైన అట్టలు ,జామెంట్రీ బాక్సులు, సామాగ్రి ఉచితంగా పంపిణీ చేశారు .ఈ సంస్థ ఇండియాలో ఏడు రాష్ట్రాలలో హౌసింగ్ లోన్ ద్వారా పేద ప్రజల రుణ బాధలను తీరుస్తూ మరియు ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. సంస్థ సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ రవల్కర్ మరియు రీజనల్ సేల్స్ మేనేజర్ మోహన్, మురళి, శివ ముఖ్య అతిథి గా తొట్టంబేడు ఎంపీడీవో సురేంద్రనాథ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో దాత శ్రీకాంత్ రావల్కర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ మెరుగ్గా రాణించి ఉన్నతమైనటువంటి స్థానాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సంస్థ సీఈఓ గారు వివిధ ప్రాంతాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవయ్య, స్రవంతి మరియు గీత పాల్గొన్నారు.
Like this:
Like Loading...
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.