
౩౦ లక్షల విలువైన బంగారం 1 కారు,02 మోటార్ సైకిళ్ళు స్వాదినం
తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగలు అరెస్టు కేసు వివరాలను తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు గురువారం నాడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. తిరుపతి వద్దకు ముగ్గురు వ్యక్తులు వెళ్ళి ఇంటి లో ఒంటరిగా ఉన్న మహిళతో తాము మున్సిపల్ ఆఫీసు నుండి వచ్చినామని, ఇంటిలో ఉన్న వాటర్ కనెక్షన్ లు మరియు డ్రైనేజ్ పైపుల కొలతలు వేయాలని ఆమెను నమ్మించినారు. ఆమె వారి మాటలు నమ్మి వారిని ఇంటి పక్కన, వెనుక ఉన్న డ్రైనేజ్ పైపుల వద్దకు తీసుకోని వెళ్ళగా, ముందుగా వేసుకున్న పధకము లో బాగముగా మరో ముద్దాయి ఆమె ఇంటిలోకి వెళ్ళి ఇంటి లో ఉన్న బీరువా, ఆలమర లలో ఉన్న బంగారు నగలు, డబ్బులు దొంగిలించుకుని రాగా తరువాత అందరూ అక్కడి నుండి పారిపోయినారు. అని తిరుపతి జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసు స్టేషన్ నందు కేశవయన గుంట, తిరుపతి కు చెందిన పోలిన ధనమ్మ ఫిర్యాదు చేయగా, తిరుపతి సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనదని అన్నారు.
జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తిరుపతి సిసిఎస్ అడిషనల్ ఎస్పీ నాగభూషణం రావు పర్యవేక్షణలో, తిరుపతి సిసిఎస్ డిఎస్పి శ్యామ్ సుందరం, ఇన్స్పెక్టర్లు జి.ప్రకాష్ కుమార్, చిన్న పెద్దయ్య, శివ కుమార్ రెడ్డి, ఎస్సై ప్రదీప్ కుమార్ రెడ్డితో సిసిఎస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి, పాత నేరస్తుల గురించి విచారించి, వారి యొక్క కదలికల పైన నిఘా పెట్టి, తిరుపతి-చెర్లోపల్లి బై పాస్ రోడ్డు లో పై కనబరిచిన నేరాలు చేయడానికి అలవాటు పడిన అంతర్ రాష్ట్ర ముద్దాయిలను అదుపులోకి తీసుకొని, వారి నుండి సుమారు సుమారు 21 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణములు 280 గ్రాములు మరియు 08 లక్షల విలువైన ఒక కారు, రెండు మోటార్ సైకిల్ లను స్వాదినం చేసుకోవడంజరిగిందన్నారు. ముద్దాయిలు కృష్ణ, అతని తమ్ముడు శరత్, వేణుగోపాల్ ఒక సభ్యులుగా ఉండి వారి సహచరులు రవి, గణేష్, ప్రశాంత్ లతో కలసి చెడు అలవాట్లుకు అలవాటు పడి, యుక్త వయసు నుండి దొంగతనలు చేయడం మొదలుపెట్టినారు. ఆ క్రమంలో వీరు బస్ లలో ప్రయాణించు ప్రయాణీకుల వద్ద బ్యాగు దొంగతనములు, జేబు దొంగతనములు, రాత్రివేళ ఇంటి దొంగతనములు, మోటార్ సైకిల్ దొంగతనములు చేస్తూ అలాగే మోసాలకు పాల్పడి, మున్సిపల్ అధికారులము అని చెప్పి, ఒక గ్రూప్ గా ఏర్పడి కాలనీలలో తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలను గమనించి వారి ఇంటి వద్దకు వెళ్ళి, మేము మున్సిపల్ అదికారులము అని చెప్పి, ఇంటి లో వాటర్ పైపులు కొలతలు వేయాలి, అని వారిని నమ్మించి మోసం చేసి వారి ఇంటిలోకి వెళ్ళి ఇంటి లోని విలువైన బంగారు, నగదు దొంగిలిస్తారు, దొంగిలించిన సొత్తులతో విలాసవంతమైన జీవితము గడుపుతున్నారు. వీరిపై పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు కాగా కొన్ని కేసులలో జైలుకు కూడా వెళ్ళినారు. వీరిపై కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పలు కేసులు ఉన్నవి. ముద్దాయిలు దొంగతనములు చేయడానికి ఉదయం, మధ్యాహ్నం సమయంలో అనగా సుమారు 10.30 గంటల నుండి 03.30 గంటల మధ్యలో ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళలు ఎంచుకుని, వారితో తాము మున్సిపల్ ఆఫీసు నుండి వచ్చినాము అని నమ్మించి ఇంటిలోకి వెళ్ళి దొంగతనములు చేస్తారని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, తెలిపారు.ఈ కేసులో ప్రతిభ కనబరిచిన తిరుపతి సిసిఎస్ ఇన్స్పెక్టర్లు జి.ప్రకాష్ కుమార్, చిన్న పెద్దయ్య, శివ కుమార్ రెడ్డి, ఎస్.ఐ ప్రదీప్ కుమార్ రెడ్డి, క్రైమ్ పార్టీ సిబ్బంది హెచ్.సి లు రవి ప్రకాష్, మురళి, మునిరాజులు, బసవరాజు రమేశ్, గోపికృష్ణ, వినాయక, పి.సి లు నాగరాజు శెట్టి, మోహన్, ప్రసాద్, హరిప్రసాద్ సైబర్ సెల్ సిబ్బంది రాజశేఖర్ లను జిల్లా ఎస్పీ అభినందించి వారికి నగదు రివార్డ్ లు ఇవ్వడము జరిగింది.