ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ అధినేత, రాజకీయ అపరచాన్యకుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్ర వర్గ కూర్పులో రాజకీయ సామాజిక న్యాయం సమకూర్చడంపై,అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అంటే మొదట బీసీలకు పెద్దపీట వేస్తున్న నమ్మకాన్ని మరోసారి నిజం చేస్తూ మంత్రివర్గ కూర్పులోఎనిమిది మంది బీసీకు పదవులు వరించాయి. అలాగే 17 మంది కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా అన్ని వర్గాలను సంతృప్తి పరిచారు. మంత్రివర్గంలో తీరిన మంత్రులు వివరాలు 1. కొణిదెల పవన్ కళ్యాణ్ (కాపు) 2. కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ, కొప్పుల వెలమ) 3. కొల్లు రవీంద్ర (బీసీ మత్స్యకార) 4. నాదెండ్ల మనోహర్ (కమ్మ) 5. పి.నారాయణ (కాపు) 6. వంగలపూడి అనిత (ఎస్సీ మాదిగ) 7. సత్యకుమార్ యాదవ్ (బీసీ, యాదవ) 8. నిమ్మల రామానాయుడు (కాపు) 9. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (ముస్లిం మైనారిటీ) 10. ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి) 11. పయ్యావుల కేశవ్ (కమ్మ) 12. అనగాని సత్యప్రసాద్ (బీసీ, గౌడ) 13. కొలుసు పార్థసారధి (బీసీ, యాదవ) 14. డోలా బాలవీరాంజనేయస్వామి (ఎస్సీ మాల) 15. గొట్టిపాటి రవి (కమ్మ) 16. కందుల దుర్గేష్ (కాపు) 17. గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ) 18. బీసీ జనార్థన్ రెడ్డి (రెడ్డి) 19. టీజీ భరత్ (ఆర్య వైశ్య) 20. ఎస్.సవితమ్మ (కురబ) 21. వాసంశెట్టి సుభాష్ (బీసీ, శెట్టిబలిజ) 22. కొండపల్లి శ్రీనివాస్ (బీసీ తూర్పు కాపు) 23. మండిపల్లి రామ్ ప్రసాద్ (రెడ్డి) 24. నారా లోకేష్ (కమ్మ) చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కొలువుతీరిన మంత్రులు వీరే.
ఏపీ మంత్రివర్గ కూర్పులో “చంద్రబాబు సామాజిక న్యాయం”
Related Posts
సామాజిక న్యాయాన్కి కట్టుబడి వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడే
మాదిగల కృతజ్ఞత యాత్రలోఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులుప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి):సామాజిక న్యాయాన్నికి కట్టుబడి, గతంలో ఎస్సీ వర్గీకరణ చేసి సామాజిక న్యాయం పాటించింది, నేడు వర్గీకరణ చేసింది కూడా చంద్రబాబు నాయుడేనని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరు వెంకటేశ్వరావు మాదిగ స్పష్టంచేశారు. కర్నూల్ టౌన్ చేరుకున్న ‘చంద్రబాబుకు మాదిగల కృతజ్ఞత’ యాత్ర సందర్భంగా ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరు వెంకటేశ్వరావు మాదిగ విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ…
Read moreమంత్రి నారాయణ ను కలిసిన నాయుడుపేట టిడిపి నేతలు
ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ను శనివారం టిడిపి నేతలు నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ,టిడిపి నేత నెలవల రాజేష్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.నెల్లూరులోని మంత్రి నారాయణ నివాసంలో ఆయనను కలిసిన వారు మంత్రి నారాయణ కు శాలువాలు కప్పి,పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ పరిధిలో పలు సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకువచ్చారు.…
Read more