ప్రభాతదర్శిన (నాయుడుపేట-ప్రతినిధి):వరల్డ్ ఫైల్స్ డే సందర్భంగా ఈనెల 20 నుండి 30వ తేదీ వరకు శతాయు ఆయుర్వేదిక్ సూప తమ హాస్పిటల్ లో ఫైల్స్,ఫిషర్ ఇన్ ఎనో,ఫిష్టులా లకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు శతాయు ఆయుర్వేదిక్ సూపర్ హాస్పిటల్చీప్ యానో రెక్టికల్ సర్జన్ డాక్టర్ అనిల్ ముసునూరు ఎమ్మెస్ తెలిపారు. నవంబర్ 20 వరల్డ్ ఫైల్స్ డే సందర్భంగా నాయుడుపేట పట్టణంలోని ఆంధ్ర బ్యాంక్ వీధిలో గల శతాయు ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఫైల్స్ కు సంబంధించిన వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం 10 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పై వ్యాధులకు ఓపితో పాటు ఉచిత మందులు ఇవ్వనున్నట్లు, సర్జరీ లపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఫైల్స్ డే సందర్భంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో సర్జరీలకు మొదటగా రిజిస్టర్ చేయించుకున్న 25 మంది కి మాత్రమే 50 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని నాయుడుపేట పట్టణంతో పాటు చుట్టుపక్క మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.పూర్తి వివరాలకు 79010 33399 సెల్ నంబర్ కు సంప్రదించాలని తెలియజేశారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.