
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఓడూరు గిరిధర్ రెడ్డి రెండోసారి ఎంపికయ్యారు. జగన్మోహన్ రెడ్డి కి విశ్వసనీయుడుగా పార్టీ ఆవిర్భావం మునుపునుండే అనుబంధం ఉన్న కారణంగా గిరిధర్ రెడ్డికి ఈ పదవి దక్కింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి తో ఓడూరు గిరిధర్ రెడ్డి కి ఉన్న అనుబంధం వీడదీయరానిదని చెప్పవచ్చు. 2004 సంవత్సరం నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ స్టేట్ కోఆర్డినేటర్ గా గిరిధర్ రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో తన అనుబంధాన్ని కొనసాగించారు. వైయస్సార్ మరణాంతరం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రలో ఓడూరు గిరిధర్ రెడ్డి ఆయనతో రాష్ట్ర మొత్తం పర్యటించారు. ఓదార్పు సభలో విజయవంతం కావడంలో ఓడూరు గిరిధర్ రెడ్డి ఎనలేని కృషి చేశారని చెప్పవచ్చు. అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఏర్పాట్లు ఆయన కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా లోని సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఓజిలి, పెళ్ళకూరు, నాయుడుపేట మండలాలలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఏర్పాట్లు లో గిరిధర్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఆయన 2011 నుండి 2014 వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014 నుండి 2017 వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పదవులు కొనసాగారు. అలాగే 2014 సంవత్సరంలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేసి పార్టీ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించారు.2019 సంవత్సరంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్నికల పరిశీలికులుగా పనిచేశారు. అలాగే 2024వ సంవత్సరంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు గాను, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా గాను గిరిధర్ రెడ్డి పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఓడూరు గిరిధర్ రెడ్డి ”ప్రభాతదర్శిని ప్రతినిధి”తో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకం ఉంచి తనకు రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. తనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేసిన పార్టీలో పెద్దలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఓడూరు గిరిధర్ రెడ్డి సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట పట్టణానికి చెందిన వారు. ఓడూరు గిరిధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక అవ్వడం పట్ల ఎంపిక అవడం పట్ల ఓడూరు గిరిధర్ రెడ్డి ని మిత్రులు శ్రేయోభిలాషులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.