ప్రభాతదర్శిని,(గూడూరు – ప్రతినిధి):గూడూరు మండల పరిధిలోని మంగళపూర్ లో ప్రభుత్వ అనుమతులతో నిర్వహిస్తున్న శ్రీనివాస మైనింగ్ నిర్వహణకు విజయ్ భాస్కర్ అనే వ్యక్తి అడ్డుకుంటూ సిబ్బందిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని అలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాసా మైనింగ్ పార్ట్నర్ ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పూర్ లోని శ్రీనివాస మైనింగ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస మైనింగ్ నిర్వహణకు జూన్ 26,2024న ప్రజాభిప్రాయ సేకరణ సేకరించి మైనింగ్ లో 78,000 టన్నుల మెటీరియల్ స్టాక్ క్లియరెన్స్ కు 2033 వరకు అనుమతుల పొంది నిర్వహించుకుంటూ ఉంటే విజయ్ భాస్కర్ అనే వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా మైనింగ్ లో భాగం ఉందని మంది మార్బలంతో ప్రతిసారి మైన్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్న సిబ్బందిపై అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని అనేకసార్లు పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇటీవల మైనింగ్ లో నిలువ ఉన్న మెటీరియల్ ను తరలిస్తుండగా శ్రీనివాస మైనింగ్ కు ఎలాంటి అనుమతులు లేవని అవాస్తవాల ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారని పూర్తిగా అన్ని అనుమతులతో కూడిన ధ్రువీకరణ పత్రాలుఉన్నాయని ఆయన తెలిపారు. బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా అలాంటివేమీ జరగడం లేదని నిల్వ ఉన్న మెటీరియల్ ను మాత్రమే తరలిస్తున్నామని అందుకు మాకు అన్ని అనుమతులు ఉన్నాయన్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.