సంస్కృతికి ప్రతిరూపం
జీవనసౌందర్యం
అసమానతలు తొలగించి
మానవజాతి పరిణామంలో
కొత్తచివురు తొడిగించేది
తెలుగుభాష ఒక్కటే.
అమ్మనేర్పిన భాష
అమ్మకుఇష్టమైన భాష
మన అమ్మభాష తెలుగు
జనమంతా తెలుగు
జగమంతా వెలుగు.
ఇసుకలో మట్టిపలకలమీద
ప్రకాశిస్తున్న తెలుగుభాష
యుగయుగాల్లో రాజస్థానాల్లో
వెలిగిన జీవద్భాష
పలుకులసొగసు తెలుగుకేతెలుసు.
పదాలపెదవులమీద మెదలుతుంటే
కలంతో వాటిని సమంచేసి
అక్షరాలుగా కూర్చి
కవిత్వమనే సంపదను సృష్టిద్దాం
తెలుగుభాష గొప్పదనాన్ని
గణనీయంగా వెలిగిద్దాం
తెలుగును ఎప్పటికీ
సజీవంగా నిలుపుదాం…
తాడినాడ భాస్కర రావు, సాహితీ సామ్రాజ్యం, అధ్యక్షులు
తణుకు.9441831544
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.