ప్రభాతదర్శిని((నాయుడుపేట ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో నాయుడుపేట పట్టణంలోని విధ్వకేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించి విజయభేరి మ్రోగించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి,ప్రిన్సిపాల్ డి రామిరెడ్డి లు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించి, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల పరీక్షా ఫలితాలు వివరాలను తెలియజేశారు. టి వెంకటాద్రి 593 మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించారని తెలిపారు. ఎం నవీన్ కుమార్ 592 మార్కులతో టౌన్ సెకండ్ సాధించారని, ఎల్ లహరి 590 మార్కులతో టౌన్ పోర్త్ స్థానం సాధించారని తెలియజేశారు. తమ పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో నూరు శాతం ఫలితాలు సాధించారని తెలియజేశారు.ఏ కల్పనా యాదవ్ 588, ఎన్ నిరంజన్ 581, పి చంద్రకళ 579, కే యోషిత 579, కె సుశిత్ రెడ్డి 574, షేక్ సిద్ధిక్ అహ్మద్ 571, ఏ సుస్మిత 558, ఏ మేఘన 503, వి తనూజ 552, ఏ హేమంత్ కుమార్ 549, ఎస్ రూప 546, పి దినేష్ కుమార్ 538, పి కుందన్ 523, పి పునీత్ 522, బి మేఘ వర్షిని 513, వి యశ్వంత్ రెడ్డి 508, డి వికాస్ 495, ఏ సుజిత 482, పి లాస్య 475, ఎన్ ప్రజ్ఞా 468, ఎం సుదీప్ 468, ఐ సంజన 462, ఆర్ శశిధర్ 457, పి లక్ష్మీ మణికంఠ 452, ఎల్ హర్ష 445, ఎస్ రాహిత్య సాయి 442, యు గౌతమ్ కార్తీక్ 440, షేక్ మొహసిన్ 424, టి విజయ్ 412, ఎన్ నిహారిక 399, షేక్ మెహరాజ్ 382, ఎస్ వెంకటేష్ 367, ఓ బ్లేస్సి 355, పి సంగీత 345, కే జాహ్నవి 335, ఎస్ సౌమ్య 330 మార్కుల సాధించి రికార్డ్ స్థాయిలో విజయభేరి మోగించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సురేష్ రెడ్డి,జమీల బేబీ,విజయ, భారతి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.