ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): బుచ్చిరెడ్డిపాళెం మండలం వ్యవసాయ మార్కెటింగ్ కమిటి ఛైర్మన్ జొన్నవాడ ప్రసాద్ వైసిపి టాటా చెప్పేపి తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమవారం బుచ్చిరెడ్డి పాలెం మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి ప్రశాంతి రెడ్డి సమక్షంలో సూరా శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో తన అనుచరులతో కలిసి ఆయన టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రశాంతి రెడ్డిని, కోవూరు ఎంఎల్ఏ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలుపించుకున్నేందుకు తాము కృషి చేస్తామని ఆయన అన్నారు. ఆయనతోపాటు బండెడ్డుల వేణు, దాసరి సుబ్బయ్య, కిష్టయ్య, జొన్నవాడ శేఖర్ చేరారు. అలాగే టిడిపి లో చేరిన అరుంధతివాడ యువతకు ప్రశాంతి రెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.