ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి):కాళ్లు కడిగి బిడ్డ కన్యాదానం చేయాల్సిన తండ్రి.. అప్పటివరకు హుషారుగా బిడ్డ పెండ్లి పనుల్లో మునిగి తేలాడు.. బంధువులను ఆహ్వానించారు. కళ్యాణ మండపమంతా కలియ తిరిగి పెళ్లి పనులు చూసుకున్నాడు. అయితే ఇంతలోనే మాయదారి గుండెపోటు..అప్పటివరకు హుషారుగా తిరిగిన వ్యక్తి కుప్ప కూలాడు. కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. కన్న కూతురు పెండ్లి జరుగుతుండగా.. పెండ్లి మండపంలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు ఓతండ్రి. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పెండ్లి ఇంట్లో విషాదం నెలకొంది. భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లికి చెందిన కుడిక్యాల బాలచంద్రం (54) గుండెపోటుతో మృతిచెందారు. జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న బాలచంద్రం..శుక్రవారం (ఫిబ్రవరి 21) న తన పెద్ద బిడ్డ మహాలక్ష్మీ పెండ్లి స్థానిక ఫంక్షన్ హాల్ లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.. కుటుంభసభ్యులు, బంధువులు అందరూ పెండ్లి మండపం చేరుకున్నారు. పెళ్లితంతు మొదలైంది. తాళికట్టే కొద్ది సమయానికి ముందు బాలచంద్రం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చికిత్సకోసం బాలచంద్రాన్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. బాలచంద్రానికి సీపీఆర్ చేసి పరీక్షించారు డాక్టర్లు.. అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు నిర్దారించారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.