ప్రభాతదర్శిని,( సూళ్లూరుపేట-ప్రతినిధి):ఇంటర్మీడియట్ ఫలితాలలో సూళ్లూరుపేట పట్టణంలోని విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో మొదటి సంవత్సరం ఎంపీసీలో కె.రామకృష్ణారెడ్డి 462 మార్కులతో మొదటి స్థానం సాధించారు.పి దీక్షిత 452 మార్కులు,ఎన్ సాయి,కె.పురుషోత్తం 451 మార్కులతో తరువాత స్థానాలలో నిలిచారు.అలాగే సెకండ్ ఇయర్ ఎంపీసీలో ఎం ముని కిరణ్ 980 మార్కులతో కళాశాల ప్రథమ స్థానం సాధించారు.కె ముని పూర్ణిమ 979 మార్కులు తో ద్వితీయ స్థానం,వి నందిని, జి రోహిత్ 978 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు.అలాగే ఐ రామ్ చరణ్ 974 , డి సుష్మా స్వరాజ్ 955 టీ నిష్మిత 951 సాధించగా బైపీసీ గ్రూపులో ఎం అలీనా 932 మార్కులు షేక్ అలియా 903 మార్కులు సాధించారు.సీఈసీ గ్రూపులో ఐ మధుమిత 860 సాధించింది. శ్రీ ప్రతిభ మరియు విక్రమ్ జూనియర్ కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడంతోపాటు క్రమశిక్షణ కలిగిన విద్యార్థులుగా పేరు సంపాదించి పెట్టారని కళాశాల కరెస్పాండెంట్ జలదంకి విజయబాబు రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రతిభ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఉమామహేశ్వరరావు,లెక్చరర్లు శివ,మంజుభాషిని,రత్న కుమార్, సుధాకర్ శ్రీనివాసులు,చెంగయ్య, రత్నం,షఫీ,వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.