ప్రభాతదర్శిని,( సూళ్లూరుపేట-ప్రతినిధి):ఇంటర్మీడియట్ ఫలితాలలో సూళ్లూరుపేట పట్టణంలోని విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో మొదటి సంవత్సరం ఎంపీసీలో కె.రామకృష్ణారెడ్డి 462 మార్కులతో మొదటి స్థానం సాధించారు.పి దీక్షిత 452 మార్కులు,ఎన్ సాయి,కె.పురుషోత్తం 451 మార్కులతో తరువాత స్థానాలలో నిలిచారు.అలాగే సెకండ్ ఇయర్ ఎంపీసీలో ఎం ముని కిరణ్ 980 మార్కులతో కళాశాల ప్రథమ స్థానం సాధించారు.కె ముని పూర్ణిమ 979 మార్కులు తో ద్వితీయ స్థానం,వి నందిని, జి రోహిత్ 978 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు.అలాగే ఐ రామ్ చరణ్ 974 , డి సుష్మా స్వరాజ్ 955 టీ నిష్మిత 951 సాధించగా బైపీసీ గ్రూపులో ఎం అలీనా 932 మార్కులు షేక్ అలియా 903 మార్కులు సాధించారు.సీఈసీ గ్రూపులో ఐ మధుమిత 860 సాధించింది. శ్రీ ప్రతిభ మరియు విక్రమ్ జూనియర్ కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడంతోపాటు క్రమశిక్షణ కలిగిన విద్యార్థులుగా పేరు సంపాదించి పెట్టారని కళాశాల కరెస్పాండెంట్ జలదంకి విజయబాబు రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రతిభ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఉమామహేశ్వరరావు,లెక్చరర్లు శివ,మంజుభాషిని,రత్న కుమార్, సుధాకర్ శ్రీనివాసులు,చెంగయ్య, రత్నం,షఫీ,వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.