ప్రభాతదర్శిని,(నాయుడుపేట-ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాయుడుపేట పట్టణంలోని శ్రీ వేమ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా శనివారం శ్రీ వేమ జూనియర్ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో కళాశాల డైరెక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. శ్రీ వేమా జూనియర్ కళాశాల స్థాపించిన 31 సంవత్సరాలుగా తమ కళాశాల విద్యార్థులు స్టాండర్డ్ ఫలితాలను సాధిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారని తెలియజేశారు. 31 సంవత్సరాల్లో తమ కళాశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లో రాణిస్తున్నారని తెలియజేశారు. ఉత్తమ ఫలితాలకు,అత్యుత్తమ శిక్షణకు శ్రీ వేమ జూనియర్ కళాశాల ల్యాండ్ మార్క్ అయిందన్నారు. క్రమశిక్షణతో, సాంకేతిక పరిజ్ఞానంతో విద్యను అందించడం ద్వారా తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని తెలియజేశారు. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో ఎం జస్వంత్ 982 మార్కులు, కే శ్రావణ్ కుమార్ రెడ్డి 982, కే సాయి హాసిని 981, కే తనిష్క 980, కే స్వప్న 975, పి రోహిణి 974, జి భాగ్యశ్రీ 973, పి చరణ్ తేజ 973, ఎస్ తనుజ 972, బి లక్ష్మీ ప్రసూన 971, పి యమునా యశస్వినీ 971, పి వర్ష 971, ఎం చంద్రపియా 971, పి చరణ్ తేజ 969, ఎంపీ దాత్రి శ్రీ 963, డి ముఖేష్ 963, ఇ మధుమతి 961, ఆర్ యోగానంద్ కార్తీక్ 959, యు ముని చైతన్య 958, కే యశ్వంత్ 957, కే లికిత 956, జి ధరణి కుమార్ 952, ఇ లేఖ శ్రీ 952, ఎస్ చంద్రిక 952, ఎం శైలజ 950 మార్కులు సాధించారని తెలియజేశారు. బైపీసీ గ్రూపులో కె నందితా చౌదరి 961 మార్కులు, పి తేజ చరణ్ 931, ఎం శాంభవి 930 మార్కులు సాధించినట్లు తెలిపారు. సీఈసీ గ్రూపులో జి అరుణ 795 మార్కులు, ఎం వర్షిత 784, పి శివకుమార్ 765 మార్కులు సాధించారన్నారు. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూపులో వి శ్రీ హాసిని 465 మార్కులు, వి నేహా శ్రీ 465, వి శ్రీహర్షిణి 463, బి తేష్ణశ్రీ 461, వై కీర్తన 461, సిహెచ్ సుప్రియ 461, ఆర్ సిరి 460, టి ముని పుష్యంత్ 460, ఎస్ అఖిల 459, కే అక్షయ 459, ఎస్ నాగశ్రీ చరిత 458, టి అక్షయ 458, వై హేమ తేజ 458, బి సాయి శ్రావణి 457, టీ గురు శృతి 456, ఏ వేణు 456, బి మౌనిష్ 455, బి శ్రేయ 455, ఎం ముని రాజా 455, ఏ ముని తనుజ 455, కే జాహ్నవి 453, జి మహిత 451, కే పద్మజ 450, పి గురు సృజన్ 445, బి రుషిత 445, ఓ హిమబిందు 442, ఎస్ కారుణ్య హాసిని 441, ఎస్ వి ఎల్ మౌనిక 441 మార్కులు సాధించారని తెలియజేశారు. అలాగే బైపిసి గ్రూపులో షేక్ అజ్రా అంజుమ్ 419 మార్కులు సాధించారని తెలిపారు. ఎం ఇ సి గ్రూపులో టి ఐశ్వర్య 455 మార్కులు సాధించారన్నారు. సీఈసీ గ్రూపులో మునిగంగాధర్ 450 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించారని తెలియజేశారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు.