ప్రభాతదర్శిని,( నాయుడుపేట-ప్రతినిధి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాయుడుపేట పట్టణంలోని విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయకేతనం ఎగరవేశారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో విక్రమ్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించారు. ఈ సందర్భంగా శనివారం విక్రమ్ జూనియర్ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో కరస్పాండెంట్ జలదంకి విజయబాబు రెడ్డి మాట్లాడారు. 2011 సంవత్సరంలో నాయుడుపేటలో ప్రారంభమైన విక్రమ్ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్టాండర్డ్ ఫలితాలను సాధిస్తూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిందని తెలియజేశారు. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ద్వితీయ సంవత్సరం ఎం పిసి లో ఎం హేమంత్ కుమార్ 988 మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించారని తెలిపారు. అలాగే బైపిసి లో ఏం దిలీప్ రెడ్డి 967 మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించారన్నారు.సీఈసీ గ్రూపులో ఎల్ సుష్మ 878 మార్కులతో టౌన్ పోస్ట్ సాధించినట్లు తెలియజేశారు. ఎం ఇ సి గ్రూపులో షేక్ సమీర్ 923 మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించారన్నారు. అలాగే షేక్ హఫీజ 972, ఎస్ ప్రశాంత్ 962, పి ముని శిరీష 958, పి మనీషా 952, ఎం బాలాజీ 950, ఎం కరిష్మా 949 మార్కులు సాధించినట్లు తెలియజేశారు. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపులో వి సాయి శివ ప్రియ 460 మార్కులతో మొదటి స్థానం, కే మాన్య 459 మార్కులతో ద్వితీయ స్థానం సాధించినట్లు తెలిపారు. అలాగే పి నిత్యశ్రీ 457, ఎన్ సుమంత్ 457, వి ముని భావన 456, ఎస్ సంజన 453, షేక్ అక్సా ఫాతిమా 450 మార్కులు సాధించినట్లు తెలిపారు. బైపీసీ గ్రూపులో షేక్ సమీరా 419 మార్కులతో మొదటి స్థానం, ఎం నిషా 417 మార్కులతో ద్వితీయ స్థానం సాధించినట్లు తెలిపారు. సీఈసీలో షేక్ ఆలియా 428 మార్కులతో మొదటి స్థానం, టి సుచిత్ర 419 మార్కులతో ద్వితీయ స్థానం సాధించగా షేక్ మాలికి ఇల హీర 400 మార్కులు సాధించారని తెలిపారు. ఎం ఇ సి గ్రూపులో షేక్ అబు ఖలీద్ 307 మార్కులు సాధించారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మగత ప్రోత్సాహక బహుమతులు అందజేసి అభినందించారు. తమ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించేందుకు కృషిచేసిన అధ్యాపక సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు కామిరెడ్డి సుబ్బారెడ్డి, ముత్యాల సంఘమిత్ర, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.