ఖాతాదారులకు అసిస్టెంట్ మేనేజర్ కుచ్చుటోపి
రెండు కోట్ల 80 లక్షలు రుణం తీసుకున్న వైనం
వార్షిక తనిఖీలలో బయటపడ్డ అవినీతి బాగోతం
నాగలాపురం బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ అరెస్ట్

ప్రభాతదర్శిని, (సత్యవేడు-ప్రతినిధి):ఆన్ లైన్ గేమ్ లకు బానిస అయినా ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారులు బ్యాంకులో కుదరపెట్టిన నగలను దొంగిలించి ప్రైవేట్ బ్యాంకులో రెండు కోట్ల 80 లక్షలు రుణం తీసుకుని ఖాతాదారులకు కుచ్చుటోపి అవినీతి బాగోతం బ్యాంకు వార్షిక తనిఖీలలో బయటపడింది. తీగ లాగితే డొంక కదిలిన చందాగా బ్యాంకు ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బ్యాంకులో కుదువలో ఉన్న నగలను దొంగతనం చేసింది అసిస్టెంట్ మేనేజరే అని పోలీసులు తేల్చి అరెస్ట్ చేశారు. సత్యవేడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కుదువ నగలను దొంగలించింది ఆ బ్యాంకులో పని చేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ ఆరవ సూర్యతేజ అని తెలిపారు.గూడూరు కు చెందిన ఇతను 2023వ సంవత్సరంలో నాగలాపురం బ్యాంకు బదిలీపై వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గురువారం సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ మురళి మాట్లాడుతూ నాగలాపురం యూనియన్ బ్యాంకులో చోటు చేసుకున్న బంగారు నగల తాకట్టు రుణాల దుర్వినియోగంపై సంబంధిత డిప్యూటీ రీజినల్ మేనేజర్ బ్రహ్మయ్య నాగలాపురం పోలీస్ స్టేషన్లో గత నెల 21వ తేదీన ఫిర్యాదు చేశారన్నారు. అయితే బ్యాంకు వార్షిక తనిఖీల్లో భాగంగా గత నెల పదవ తేదీ శ్రీరాజకమల్ నాయక్ వచ్చిన అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ఆరవ సూర్యతేజ బ్యాంకు రాకుండా గైర్హాజరు అయ్యారన్నారు.
దీంతో ఆడిటర్ ఫోన్లో సంప్రదించగా నేరం ఒప్పుకోవడంతో అవాక్కయ్యారు అన్నారు.ఈ నేపథ్యంలో దీనిపై కేసు నమోదు చేయడం జరిగింది అన్నారు.యూనియన్ బ్యాంకులో 3496 మంది ప్రజలకు సంబంధించి వారి అవసరాలు నిమిత్తం తాకట్టు పెట్టి 47.67 కోట్లు రుణం పొందారన్నారు.బ్యాంకులో నగల తనకా,భద్రపరిచే ఐరన్ సేఫ్లకు కస్టోడియన్లగా మేనేజర్గా పనిచేస్తున్న తిరైవరాజ్,అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న ఆరవసూర్యతేజ వ్యవహరిస్తారన్నారు.
అయితే బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్న తిరైవరాజ్ బాధ్యతను విస్మరించి నిర్లక్ష్యం వహించడం వల్ల దీన్ని ఆసరా చేసుకుని అసిస్టెంట్ మేనేజర్ ఆరవసూర్యతేజ 30 మంది బంగారు నగలను(2634 గ్రాములు) బ్యాంకు నుంచి దొంగతనంగా బయటికి తీసుకెళ్లినట్టు ఆయన చెప్పారు.ఈ క్రమంలో పుత్తూరులోనే ముత్తూట్,ఐఐఎఫ్ఎల్,మన్నఉరు వంటి ఫైనాన్స్ సంస్థలు,బ్యాంక్ ఆఫ్ బరోడా,ఊతుకోట మహారాజా, వంటి బ్యాంకులు, ప్రేమలత, విగ్నేష్,సుమన్ వంటి కుదవ దుకాణాల్లో నగలను తాకట్టు పెట్టి ఒక కోటి 35 లక్షల రూపాయలు రుణం తీసుకున్నట్టు ఆయన వివరించారు.ఇదేకాక 11 మంది పేర్లు పైన బంగారు నగలను యూనియన్ బ్యాంకు లోనే పదే పదే మార్చి తాకట్టు పెట్టి దాదాపు ఒక కోటి 30 లక్షల రూపాయలు అసిస్టెంట్ మేనేజర్ కొట్టేసారన్నారు.
ఈ మొత్తము రెండు కోట్ల 80 లక్షల రూపాయలను ఆన్లైన్ క్యాసినో జూదంలో పోగొట్టుకున్నట్టు విచారణలో తెలియవచ్చింది అన్నారు.దీనిపై కూడా సైబర్ నిపుణులతో లోతైన విచారణ చేస్తున్నామన్నారు.బంగారు నగల తాకట్టుకు సంబంధించిన రసీదులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.అదేవిధంగా బంగారు నగల రికవరీ సంబంధించి చర్యలు ఉంటుందన్నారు.సస్పెండ్ అయిన గూడూరుకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ ఆరవసూర్యతేజ 2023 మే నెలలో బెంగళూరు నుంచి నాగలాపురంకు బదిలీ అయినట్టు ఆయన పేర్కొన్నారు.
అలాగే తమిళనాడు సేలంకు చెందిన బ్యాంక్ మేనేజర్ తిరైవరాజ్ పాత్ర పై కూడా విచారణ జరుపుతున్నామన్నారు.ఆన్లైన్ ఆటలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.బ్యాంక్ మేనేజర్లే ఇందులో చిక్కుకుని కేసు నమోదైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.కాగా సస్పెండ్కు గురై అరెస్టు చేసిన అసిస్టెంట్ మేనేజర్, నిందితుడు ఆరవ సూర్యతేజను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు చెప్పారు.ఈ సమావేశంలో నాగలాపురం ఎస్ఐ సునీల్ తదితరులు ఉన్నారు.